అత్యధిక ఆదాయం కలిగిన కంపెనీగా రిలయన్స్
Sakshi Education
దేశంలో అత్యధిక ఆదాయం, లాభం కలిగిన కంపెనీగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఆర్ఐఎల్) రికార్డు నెలకొల్పింది.

2018-19 ఆర్థిక సంవత్సరంలో ఆర్ఐఎల్ రూ.6.23 లక్షల కోట్ల టర్నోవర్, రూ.39,588 కోట్ల లాభాన్ని నమోదుచేసింది. ప్రభుత్వరంగంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ను (ఐవోసీ) 2018-19లో 6.17 లక్షల కోట్ల టర్నోవర్, 17,274 కోట్ల లాభాన్ని నమోదుచేసింది.
మరోవైపు మరే కంపెనీకి లేని విధంగా ఆర్ఐఎల్ వద్ద రూ.1.33 లక్షల కోట్ల నగదు నిల్వలు ఉన్నాయి. స్థూల రుణ భారం విషయంలోనూ ప్రముఖ స్థానం రిలయన్స్ దే కావడం విశేషం. 2019 మార్చి నాటికి రూ.2.87 లక్షల కోట్ల రుణాలు ఆర్ఐఎల్ తీసుకుని ఉంది. ఐవోసీ రుణ భారం రూ.92,700 కోట్లు. మార్కెట్ విలువ పరంగా ఇప్పటికే రిలయన్స్ ఇండస్ట్రీస్ దేశంలో టాప్ కంపెనీగా ఉన్న విషయం తెలిసిందే. 2018 వరకు వరకు ఐవోసీ ప్రభుత్వరంగంలో అత్యంత లాభదాయకత కలిగిన కంపెనీగా ఉండగా, 2018-19లో ఓఎన్జీసీ ఈ స్థానాన్ని ఆక్రమించుకుంది. ఓఎన్జీసీ మార్చి క్వార్టర్ ఫలితాలను ఇంకా ప్రకటించాల్సి ఉంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : దేశంలో అత్యధిక ఆదాయం, లాభం కలిగిన కంపెనీ
ఎప్పుడు : మే 21
ఎవరు : రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఆర్ఐఎల్)
మరోవైపు మరే కంపెనీకి లేని విధంగా ఆర్ఐఎల్ వద్ద రూ.1.33 లక్షల కోట్ల నగదు నిల్వలు ఉన్నాయి. స్థూల రుణ భారం విషయంలోనూ ప్రముఖ స్థానం రిలయన్స్ దే కావడం విశేషం. 2019 మార్చి నాటికి రూ.2.87 లక్షల కోట్ల రుణాలు ఆర్ఐఎల్ తీసుకుని ఉంది. ఐవోసీ రుణ భారం రూ.92,700 కోట్లు. మార్కెట్ విలువ పరంగా ఇప్పటికే రిలయన్స్ ఇండస్ట్రీస్ దేశంలో టాప్ కంపెనీగా ఉన్న విషయం తెలిసిందే. 2018 వరకు వరకు ఐవోసీ ప్రభుత్వరంగంలో అత్యంత లాభదాయకత కలిగిన కంపెనీగా ఉండగా, 2018-19లో ఓఎన్జీసీ ఈ స్థానాన్ని ఆక్రమించుకుంది. ఓఎన్జీసీ మార్చి క్వార్టర్ ఫలితాలను ఇంకా ప్రకటించాల్సి ఉంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : దేశంలో అత్యధిక ఆదాయం, లాభం కలిగిన కంపెనీ
ఎప్పుడు : మే 21
ఎవరు : రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఆర్ఐఎల్)
Published date : 22 May 2019 06:08PM