Skip to main content

అతి తీవ్ర తుపాన్‌గా అంఫన్

ఆగ్నేయ బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న తీవ్ర తుపాన్‌ ‘అంఫన్‌’.. ఉత్తర దిశగా ప్రయాణిస్తూ మే 17న అతి తీవ్ర తుపాన్‌గా మారింది.
Current Affairs
ఒడిశాలోని పారాదీప్‌కు దక్షిణ దిశగా 930 కిమీ దూరంలోనూ, పశ్చిమ బెంగాల్‌లోని దిఘాకు నైరుతి దిశలో 1,080 కిమీ దూరంలో, బంగ్లాదేశ్‌లోని ఖేపుపురకు దక్షిణ నైరుతి దిశగా 1,200 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది మరింత వేగంగా బలపడి మే 18న అత్యంత తీవ్ర తుపాన్‌గా మారనుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ), విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించాయి. అనంతరం.. పశ్చిమ బెంగాల్‌–బంగ్లాదేశ్‌ మధ్య దిఘా, బంగ్లాదేశ్‌లోని హతియా దీవుల మధ్యలో అంఫాన్‌ మే 20న‌తీరం దాటే అవకాశం ఉందని తెలిపాయి. దీని ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్లో భారీ వర్షాలు కురుస్తాయనీ.. ఏపీలో మాత్రం మోస్తరు వర్షాలకు మాత్రమే అవకాశం ఉందని వివరించారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : అతి తీవ్ర తుపాన్‌గా అంఫన్
ఎప్పుడు : మే 17
ఎవరు : భారత వాతావరణ విభాగం (ఐఎండీ)
ఎక్కడ : ఆగ్నేయ బంగాళాఖాతం
Published date : 18 May 2020 08:28PM

Photo Stories