‘అరుణాచల్’లో కమల వికాసం
Sakshi Education
అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. మొత్తం 60 స్థానాలకు గానూ బీజేపీ 28 స్థానాల్లో ఘనవిజయం సాధించగా, మిత్రపక్షం జేడీయూ ఆరు స్థానాల్లో గెలుపొందింది.

కాగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం 3 స్థానాలకు పరిమితమైంది. అరుణాచల్ప్రదేశ్లో ప్రభుత్వ ఏర్పాటుకు 31 స్థానాలు అవసరమైన నేపథ్యంలో మిత్రపక్షం బీజేపీకి మద్దతు ఇస్తామని జేడీయూ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు లాఛనంకానుంది. ముఖ్యమంత్రి పెమా ఖండూతో పాటు పార్టీ విజయం కోసం కృషిచేసిన బీజేపీ కార్యకర్తలను మోదీ అభినందించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సత్తా
ఎప్పుడు: మే 23
ఎక్కడ: అరుణాచల్ ప్రదేశ్
క్విక్ రివ్యూ:
ఏమిటి: అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సత్తా
ఎప్పుడు: మే 23
ఎక్కడ: అరుణాచల్ ప్రదేశ్
Published date : 24 May 2019 09:28PM