Skip to main content

ఆర్థిక మోసాలపై డిజిటల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఏర్పాటు

అవాంఛిత కాల్స్, టెలికం వనరుల ఆధారంగా జరిగే ఆర్థిక మోసాలను కట్టడి కోసం... డిజిటల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (డీఐయూ) ఏర్పాటు చేయాలని కేంద్ర టెలికం శాఖ నిర్ణయించింది.
Current Affairs
కేంద్ర టెలికం శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ నేతృత్వంలో ఫిబ్రవరి 15న జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు.

నోమురా అంచనాల ప్రకారం 2021-22లో భారత్ వృద్ధి రేటు?
2021-22 ఆర్థిక సంవత్సరంలో భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 13.5 శాతంగా ఉంటుందని జపాన్ బ్రోకరేజ్ సంస్థ నోమురా అంచనావేసింది. ఈ మేరకు ఫిబ్రవరి 15న ఒక నివేదికను విడుదల చేసింది. భారత్ ఎకానమీలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని నివేదికలో పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) భారత్ ఎకానమీ క్షీణత 6.7 శాతానికి పరిమితమవుతుందని అంచనా వేసింది.

క్విక్ రివ్యూ :

ఏమిటి : త్వరలో డిజిటల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (డీఐయూ) ఏర్పాటు
ఎప్పుడు : ఫిబ్రవరి 15
ఎవరు : కేంద్ర టెలికం శాఖ
ఎందుకు : అవాంఛిత కాల్స్, టెలికం వనరుల ఆధారంగా జరిగే ఆర్థిక మోసాలను కట్టడి కోసం..
Published date : 16 Feb 2021 05:46PM

Photo Stories