Skip to main content

ఆర్‌టీఐ కమిషనర్‌గా ఐలాపురం రాజా నియమాకం

ఆర్‌టీఐ కమిషనర్‌గా ఐలాపురం రాజాను గవర్నర్ నియమించినట్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మే 13న ఉత్తర్వులు జారీ చేసింది.
బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఐదేళ్ల పాటు లేదా 65 ఏళ్ల వయసు వచ్చే వరకు రాజా పదవిలో ఉంటారు. ఏది ముందు అయితే అది వర్తిస్తుంది. సామాజిక సేవలు అందించారంటూ ఐలాపురం రాజా, శ్రీరామమూర్తిని కమిషనర్లుగా నియమించాలని కోరుతూ గవర్నర్ నరసింహన్‌కు ఫైలు పంపించారు. దీనిపై గవర్నర్ కార్యాలయం స్పందిస్తూ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున కేంద్ర ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి తిప్పి పంపారు. దీంతో వీరి ఎంపికకు అనుమతి కోరుతూ సీఈసీని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దీంతో గవర్నర్ కార్యాలయం వీరిద్దరి సామాజిక సేవల రికార్డులు, వారి గత చరిత్రలపై ఆరా తీసింది. ఐలాపురం రాజాకు సంబంధించిన సామాజిక సేవలపై గవర్నర్ సంతృప్తి వ్యక్తం చేయడంతో ఆయనను ఆర్‌టీఐ కమిషనర్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మరో వ్యక్తి శ్రీరామమూర్తి సామాజిక సేవలకు సంబంధించిన అంశాలు సంతృప్తికరంగా ఏమీ లేవని, ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు ఏమైనా ఉంటే పంపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఆర్‌టీఐ నూతన కమిషనర్ నియమాకం
ఎప్పుడు: మే 13
ఎవరు: ఐలాపురం రాజా
ఎక్కడ: ఆంధ్రప్రదేశ్
Published date : 14 May 2019 06:09PM

Photo Stories