Skip to main content

అంతర్జాతీయ ప్రదర్శనకు ఫణిగిరి శిల్పం

అమెరికాలోని న్యూయార్క్‌లో నిర్వహించనున్న ‘ది మెట్రోపాలిటన్ మ్యూజియమ్స్ ఆఫ్ ఆర్ట్ (ది మెట్)’150వ వార్షికోత్సవంలో ఫణిగిరి శిల్పాన్ని ప్రదర్శించనున్నారు.
న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్ మ్యూజియంలో 2020లో నిర్వహించనున్న ఈ వేడుకలో ‘ట్రీ అండ్ సర్పెంట్’పేరుతో బుద్ధుడి ఇతివృత్తంగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ప్రపంచవ్యాప్తంగా వివిధ మ్యూజియాల్లో ఉన్న బుద్ధుడికి సంబంధించిన అరుదైన కళాఖండాలను ప్రదర్శించనున్నారు. ఈ ప్రదర్శనకు ఢిల్లీలోని నేషనల్ మ్యూజియం ఫణిగిరి శిల్పాన్ని ఎంపికచేసింది. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా ఫణిగిరిలో లభించిన ఈ శిల్పాన్ని ఇక్ష్వాకుల కాలంలో రూపొందించారు. నాలుగు అడుగుల ఎత్తున్న ఈ సున్నపురాయి శిల్పాన్ని ఫణిగిరి బౌద్ధ స్థూపం పరిసరాల్లో 2001లో కనుగొన్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
అంతర్జాతీయ ప్రదర్శనకు ఫణిగిరి శిల్పం
ఎప్పుడు : మే 17
ఎక్కడ : న్యూయార్క్, అమెరికా
Published date : 18 May 2019 05:22PM

Photo Stories