అంతర్జాతీయ బుద్ధ పూర్ణిమ కార్యక్రమంలో మోదీ
Sakshi Education
భారత సాంస్కృతిక శాఖ, అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్య సంయుక్తంగా నిర్వహించిన అంతర్జాతీయ బుద్ధ పూర్ణిమ కార్యక్రమంలో మే 7న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.

కరోనావైరస్ బాధితులు, ఆ వైరస్పై ముందుండి పోరాడుతున్న వీరులకు గౌరవ సూచకంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రపంచంలోని దాదాపు అన్ని బౌద్ధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లుంబిని వనం(నేపాల్), మహాబోధి ఆలయం(బోధి గయ, బిహార్), ముల్గంధ కుటి విహార(సారనాథ్, ఉత్తరప్రదేశ్), పరినిర్వాణ స్థూప(కుషినగర్, ఉత్తరప్రదేశ్), అనురాధపుర స్థూప(శ్రీలంక) తదితర పవిత్ర బౌద్ధ ప్రదేశాల్లో జరిగిన ప్రార్థనలను ప్రత్యక్ష ప్రసారం చేశారు.
కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈ కష్ట సమయంలో ఆపదలో ఉన్న ప్రతీ ఒక్కరినీ ఆదుకునేందుకు భారత్ కట్టుబడి ఉందని వ్యాఖ్యానించారు. సాయం కోరిన ప్రతీ దేశాన్ని ఆదుకోవడానికి భారత్ ప్రయత్నించిందని తెలిపారు. ‘బుద్ధ అనేది ఒక పేరు మాత్రమే కాదు. అది ఒక పవిత్ర భావన. స్థల, కాల పరిస్థితులు మారినా ఆయన బోధనలు మనలో ప్రవహిస్తూనే ఉంటాయి’అని కొనియాడారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అంతర్జాతీయ బుద్ధ పూర్ణిమ కార్యక్రమం
ఎప్పుడు : మే 7
ఎవరు : భారత సాంస్కృతిక శాఖ, అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్య
ఎందుకు : కరోనావైరస్ బాధితులు, ఆ వైరస్పై ముందుండి పోరాడుతున్న వీరులకు గౌరవ సూచకంగా
క్విక్ రివ్యూ :
ఏమిటి : అంతర్జాతీయ బుద్ధ పూర్ణిమ కార్యక్రమం
ఎప్పుడు : మే 7
ఎవరు : భారత సాంస్కృతిక శాఖ, అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్య
ఎందుకు : కరోనావైరస్ బాధితులు, ఆ వైరస్పై ముందుండి పోరాడుతున్న వీరులకు గౌరవ సూచకంగా
Published date : 08 May 2020 07:25PM