Skip to main content

ఆంధ్రప్రదేశ్ సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం

ఆంధ్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రిగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు యెడుగూరి సందింటి జగన్‌మోహన్‌రెడ్డి (వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి) మే 30న ప్రమాణ స్వీకారం చేశారు.
విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైఎస్ జగన్‌తో గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారానికి ముందు వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిగా నియమిస్తూ గవర్నర్ జారీ చేసిన నియామక పత్రాన్ని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం చదివి వినిపించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, డీఎంకే అధ్యక్షుడ స్టాలిన్ పాల్గొన్నారు.

ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్ వృద్ధ్యాప్య పెన్షన్‌ను నెలకు రూ.2,250లకు పెంచే ఫైలుపై సీఎంగా తొలి సంతకం చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలకు 151 స్థానాలను వెఎస్సార్‌సీపీ గెలుచుకుంది. అలాగే 25 లోక్‌సభ స్థానాలకు 22 స్థానాల్లో విజయం సాధించింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఆంధ్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం
ఎప్పుడు : మే 30
ఎవరు : వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం, విజయవాడ, ఆంధ్రప్రదేశ్
Published date : 31 May 2019 05:09PM

Photo Stories