Skip to main content

అండమాన్ ఆప్టికల్‌ ఫైబర్‌ వ్యవస్థ ప్రారంభం

తమిళనాడు రాజధాని చెన్నై నుంచి అండమాన్ నికోబార్ దీవుల పోర్ట్‌బ్లెయిర్‌ వరకు సముద్ర గర్భంలో ఏర్పాటు చేసిన ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ను ఆగస్టు 10న ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.
Current Affairs

రూ.1,224 కోట్లతో చెన్నై నుంచి పోర్ట్‌ బ్లెయిర్‌ , అక్కడ్నుంచి ఇతర ద్వీపసమూహాలకు2,312కి.మీ. పొడవున వేసిన ఈ కేబుల్‌తో అండమాన్ నికోబర్‌ దీవుల్లో ప్రజలకు 4జీ ఇంటర్నెట్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయి.


ట్రాన్స్షిప్‌మెంట్‌ పోర్ట్ నిర్మాణం...

ఆప్టికల్‌ ఫైబర్‌ ప్రారంభం సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ... భారత్‌ యాక్ట్‌ ఈస్ట్‌ పాలసీలో అండమాన్ నికోబార్‌ దీవులు మరింత కీలకంగా మారాయన్నారు. సెకండ్‌కి 2200జీబీపీఎస్‌ సామర్థ్యం గల ఈ కేబుల్‌ వ్యవస్థ ద్వారా అండమాన్ ద్వీప సమూహానికి స్వాతంత్య్ర దినోత్సవ కానుక ముందే లభించినట్టయిందని వ్యాఖ్యానించారు. సరకు రవాణా ద్వారా వాణిజ్య కార్యకలాపాలను పెంచడానికి 10 వేల కోట్లతో గ్రేట్‌ నికోబార్‌ ద్వీపసమూహంలో ట్రాన్స్ షిప్‌మెంట్‌ ఏర్పాటు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయన్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
అండమాన్ ఆప్టికల్‌ ఫైబర్‌ వ్యవస్థ ప్రారంభం
ఎప్పుడు : ఆగస్టు 10
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీఎందుకు :అండమాన్ నికోబర్‌ దీవుల్లో ప్రజలకు 4జీ ఇంటర్నెట్‌ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు
Published date : 11 Aug 2020 05:30PM

Photo Stories