Skip to main content

అమెరికాలో రోగులకు భారత్‌ మందులు

అమెరికాలో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కోవిడ్‌ రోగులకు భారత్‌ పంపించిన యాంటీ మలేరియా ఔషధం హైడ్రాక్సీ క్లోరోక్విన్ (హెచ్‌సీక్యూ)ను ఇస్తున్నట్టుగా మెడికల్‌ పబ్లికేషన్‌ ఎండెడ్జ్ మే 2న వెల్లడించింది.
Current Affairsఅమెరికాలో కరోనా హాట్‌స్పాట్‌లలో ఒకటైన కనెక్టికట్‌లో క్లోరోక్విన్ ఔషధాన్ని ఎక్కువగా వాడుతున్నారు. కరోనాపై పోరాటంలో క్లోరోక్విన్‌ గేమ్‌ ఛేంజర్‌గా మారుతుందని గతంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికాలో మరణాలు లక్షలోపు ఉండవచ్చునని ట్రంప్‌ అంచనా వేశారు.

రెమిడెస్‌విర్‌కు ఎఫ్‌డీఏ అనుమతి
వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌లను నియంత్రించడానికి వాడే రెమిడెస్‌విర్‌ ఔషధాన్ని అత్యవసర సమయాల్లో కోవిడ్‌ రోగులకు ఇవ్వడానికి అమెరికా ఫుడ్‌ అండ్డ్ర గ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌డీఏ) అనుమతి ఇచ్చింది. కరోనా వైరస్‌ను కూడా నియంత్రించడానికి ఈ మందు ఉపయోగపడుతుందని ఇప్పటికే పలు పరిశోధనల్లో తేలింది.
Published date : 04 May 2020 07:42PM

Photo Stories