ఆలూ రైతులపై పెప్సీ కేసులు వెనక్కి
Sakshi Education
గుజరాత్లో బంగాళదుంపలు పండించిన రైతులపై తాము వేసిన కేసులను ఉపసంహరించుకోనున్నట్లు ఆహార, పానీయ ఉత్పత్తుల సంస్థ పెప్సీకో మే 2. ప్రకటించింది.

గుజరాత్లోని కొంతమంది రైతులు ఎఫ్సీ-5 రకం బంగాళదుంపలను పండించారు. అయితే ఆ రకం బంగాళదుంపలపై తమకు పంటరకం రక్షణ హక్కులు ఉన్నాయనీ, తమ అనుమతి లేకుండా వీటిని ఎవరూ పండించకూడదంటూ పెప్సీకో మొత్త 11 మంది రైతులపై కేసు వేసింది. ఈ రకం బంగాళదుంపలను పెప్సీలో తమ లేస్ చిప్స్ తయారీకి వినియోగిస్తోంది.
Published date : 03 May 2019 05:48PM