Skip to main content

అక్టోబర్ 22న బీసీసీఐ ఎన్నికలు

2019, అక్టోబర్ 22న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఎన్నికలు జరగనున్నాయి.
ఈ మేరకు సుప్రీం కోర్టు నియమించిన పరిపాలక కమిటీ (సీఓఏ) క్రికెట్ బోర్డుకు మే 21న ఎన్నికల నగారా మోగించింది. రెండేళ్లకు పైగా సరైన పాలకవర్గం లేని బీసీసీఐ ఎట్టకేలకు ఈ ఎన్నికలతో పూర్తిస్థాయి కార్యవర్గంతో పనిచేస్తుందని సీఓఏ చీఫ్ వినోద్ రాయ్ అన్నారు.

కమిటీ విధివిధానాలు ఖరారు చేస్తాం
భారత బ్యాటింగ్ దిగ్గజాలు సచిన్, గంగూలీ, లక్ష్మణ్‌లతో కూడిన క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) విధి విధానాలను ఖరారు చేస్తామని పరిపాలక కమిటీ (సీఓఏ) తెలిపింది. ఇటీవల బీసీసీఐ ఎథిక్స్ ఆఫీసర్, అంబుడ్‌‌సమన్ డీకే జైన్ చేపట్టిన పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశం విషయంలో సీఏసీ విధులేమిటో, పదవీ కాలమెంతో, అసలు పరిధి ఎంతో ఎవరికీ తెలియదని వీవీఎస్ లక్ష్మణ్ బహిరంగంగా సీఓఏపై మండిపడ్డారు. దీంతో సీఏసీ విధివిధానాలు రూపొందించి... డీకే జైన్ ఆమోదం తర్వాత ప్రకటిస్తామని సీఓఏ వర్గాలు వెల్లడించాయి.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
అక్టోబర్ 22న బీసీసీఐ ఎన్నికలు
ఎప్పుడు : మే 21
ఎవరు : క్రికెట్ పరిపాలక కమిటీ (సీఓఏ)
Published date : 22 May 2019 06:16PM

Photo Stories