ఆకాశ్-1ఎస్ క్షిపణి పరీక్ష విజయవంతం
Sakshi Education
భారత రక్షణ పరిశోధనా, అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) ఆకాశ్ -1ఎస్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది.

ఒడిశాలోని బాలాసోర్ తీరం నుంచి మే 27న ఈ ప్రయోగాన్ని చేపట్టారు. భూ ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాన్ని ఛేదించే సామర్థ్యం గల ఈ క్షిపణిని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో డీఆర్డీవో రూపొందించింది. భూ ఉపరితలం నుంచి 18 నుంచి 30 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న శత్రు దేశాల యుద్ధ విమానాలు, క్రూయీజ్ క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లను ఆకాశ్- 1ఎస్ సమర్థంగా కూల్చేయగలదు. ఆకాశ్-1ఎస్ క్షిపణిని మే 25, 27న రెండుసార్లు విజయవంతంగా పరీక్షించినట్లు డీఆర్డీవో తెలిపింది.
Published date : 28 May 2019 06:46PM