Skip to main content

ఐసీసీ ర్యాంకుల్లో భారత్‌కు అగ్రస్థానం

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రకటించిన వార్షిక ర్యాంకుల్లో భారత్ (113 పాయింట్లు) నంబర్‌వన్ టెస్టు జట్టుగా నిలిచింది.
అదేవిధంగా వన్డేల్లో ఇంగ్లండ్ (123 పాయింట్లు) అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. టెస్టుల్లో భారత్ తర్వాతి స్థానాల్లో వరుసగా న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా నిలిచాయి. భారత్ 2016 అక్టోబర్ నుంచి టెస్టుల్లో టాప్ ర్యాంకులో కొనసాగుతోంది. మరోవైపు వన్డేల్లో ఇంగ్లండ్ తర్వాత స్థానాల్లో వరుసగా భారత్ (121), దక్షిణాఫ్రికా (115) ఉన్నాయి. తాజా ర్యాంకుల గణనలో 2015-16 సీజన్ ప్రదర్శనను తొలగించి, 2016-17, 2017-18 సీజన్‌ల ప్రదర్శనకు 50 శాతం వెయిటేజీ ఇచ్చారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఐసీసీ టెస్టు ర్యాంకుల్లో అగ్రస్థానం
ఎప్పుడు : మే 2
ఎవరు : భారత్
Published date : 03 May 2019 05:30PM

Photo Stories