Skip to main content

ఐఎస్‌ఎస్‌ఎఫ్ ఘూటింగ్‌లో రెండు స్వర్ణాలు

అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్) ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్‌లో భారత్‌కు రెండు స్వర్ణాలు లభించాయి. జర్మనీలోని మ్యూనిక్ నగరంలో జరగుతున్న ఈ టోర్నిలో సౌరభ్ చౌధరీ, రాహీ సర్నోబత్ స్వర్ణ పతకాలను సాధించారు.
ఈ క్రమంలో సౌరభ్ చౌధరీ రెండు కొత్త ప్రపంచ రికార్డులు నెలకొల్పగా... రాహీ ఒలింపిక్ బెర్త్‌ను అందించింది. ఇప్పటివరకు భారత షూటర్లు ఆరు విభాగాల్లో ఒలింపిక్ బెర్త్‌లను సాధించారు.

మే 27న జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో సౌరభ్ 246.3 పాయింట్లు స్కోరు చేసి స్వర్ణం దక్కించుకున్నాడు. దాంతో 245 పాయింట్లతో తన పేరిటే ఉన్న సీనియర్ ప్రపంచ రికార్డును... 245.5 పాయింట్లతో ఉన్న జూనియర్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. మరోవైపు మహిళల 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో ఆసియా క్రీడల చాంపియన్ రాహీ సర్నోబత్ 37 పాయింట్లు సాధించి విజేతగా నిలిచింది.
Published date : 28 May 2019 06:34PM

Photo Stories