Skip to main content

ఐఎన్‌ఎస్ వెళా ప్రారంభం

భారత నౌకాదళం కోసం నిర్మించిన ఇండియన్ నావల్ షిప్(ఐఎన్‌ఎస్) వెళాను ముంబైలో మే 6న ప్రారంభించారు. ముంబైలోని మజ్‌గావ్ డాక్ షిప్ బిల్డర్స్ సంస్థ దీనిని నిర్మించింది.
ప్రాజెక్టు 75లో భాగంగా ఆరు స్కార్పీన్ రకం జలాంతర్గాములను మజ్‌గావ్ డాక్ నిర్మించాలి. ఈ ఆరింటిలో మొద‌టిది అయిన ఐఎన్‌ఎస్ కల్వరిని ప్రధాని నరేంద్ర మోదీ 2017, డిసెంబర్ 14న ప్రారంభించారు. తాజాగా ప్రారంభమైన ఐఎన్‌ఎస్ వెళా స్కార్పీన్ రకంలో నాలుగో జలాంతర్గామి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఐఎన్‌ఎస్ వెళా ప్రారంభం
ఎప్పుడు : మే 6
ఎక్కడ : ముంబై, మహారాష్ట్ర
Published date : 08 May 2019 06:00PM

Photo Stories