Skip to main content

ఐఏఎస్‌ఈ సౌత్ ఉపాధ్యక్షుడిగా ప్రదీప్

హైదరాబాద్: ట్రిపుల్‌ఐటీ హైదరాబాద్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ప్రదీప్ కె రామన్‌చర్లకు అరుదైన అవకాశం దక్కింది.
ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ స్ట్రక్చరల్ ఇంజనీర్స్ (ఐఏఎస్‌ఈ) దక్షిణ భారత ఉపాధ్యక్షుడిగా ఆయన ఎంపికయ్యారు. దేశంలోని దక్షిణ ప్రాంతంలో ఐఏఎస్‌ఈని విస్తరించే బాధ్యతలు ఆయనకు అప్పగించారు. ప్రధానంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, కేరళ, లక్షద్వీప్, పాండిచ్చేరి, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఐఏఎస్‌ఈని విస్తరించడానికి ఆయన కృషి చేయాల్సి ఉంటుంది. 2002 నుంచి భూకంపాల అంశంపై ట్రిపుల్ ఐటీలోని ఎర్త్‌క్వేక్ ఇంజనీరింగ్ రీసెర్చ్ సెంటర్ హెడ్‌గా ఆయన అనేక పరిశోధనలు చేశారు. అంతేకాకుండా స్ట్రక్చరల్ ఇంజనీరింగ్‌పై ఎంటెక్, పీహెచ్‌డీ కోర్సులను ట్రిపుల్‌ఐటీ హైదరాబాద్‌లో నిర్వహించడంలో కీలకపాత్ర పోషించారు. స్ట్రక్చరల్ ఇంజనీర్లతో జాతీయ స్థాయిలో ఏర్పడిన సంస్థలో ఆయనకు అరుదైన పదవి లభించడం పట్ల పలువురు ప్రొఫెసర్లు హర్షం వ్యక్తం చేశారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఐఏఎస్‌ఈ సౌత్ ఉపాధ్యక్షుడిగా ప్రదీప్ ఎంపిక
ఎందుకు: దక్షిణ భారతదేశంలో ఐఏఎస్‌ఈని విస్తరించడానికి
ఎవరు: ప్రొఫెసర్ ప్రదీప్ కె రామన్‌చర్ల
Published date : 14 May 2019 06:17PM

Photo Stories