Skip to main content

ఐఏఎఫ్‌కు తొలి అపాచీ హెలికాప్టర్

భారత వాయుసేన (ఐఏఎఫ్)కు తొలి అపాచీ గార్డియన్ అటాక్ హెలికాప్టర్‌ను అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థ అప్పగించింది.
భారత వాయుసేన (ఐఏఎఫ్) 2015 సెప్టెంబర్‌లో అమెరికా ప్రభుత్వం, బోయింగ్ సంస్థతో భారత వాయుసేన 22 అపాచీ హెలికాప్టర్ల కోసం ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా మొదటి హెలికాప్టర్‌ను అరిజోనాలోని మెసాలో భారతవాయుసేనకి అమెరికా అప్పగించింది. జూలైలో మొదటి హెలికాప్టర్ భారత్‌కు రానుంది. 2017లో భారత రక్షణ మంత్రిత్వ శాఖ మరో ఆరు అపాచీ హెలికాప్టర్ల కొనుగోలుకు బోయింగ్ సంస్థతో రూ.4,168 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. టాటా బోయింగ్ ఏరోస్పేస్ లిమిటెడ్, హైదరాబాద్‌లోని టాటా అడ్వాన్స్ డ్ సిస్టం సంయుక్తంగా ఈ హెలికాప్టర్ల విడిభాగాలను ఉత్పత్తి చేయనున్నాయి.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
భారత వాయుసేన (ఐఏఎఫ్)కు తొలి అపాచీ హెలికాప్టర్
ఎప్పుడు : మే 12
ఎవరు : బోయింగ్ సంస్థ
ఎక్కడ : మెసా, అరిజోనా, అమెరికా
Published date : 13 May 2019 05:41PM

Photo Stories