600 కోట్ల డ్రగ్స్ ఉన్న పాక్ పడవ పట్టివేత
Sakshi Education
రూ. 600 కోట్ల విలువైన మాదకద్రవ్యాలతో నిండిన పాకిస్తానీ పడవను భారత తీరప్రాంత భద్రతాదళం (ఇండియన్ కోస్ట్ గార్డ్-ఐసీజీ) మే 21న పట్టుకుంది.

గుజరాత్ తీరానికి దూరంగా, రెండు రోజులపాటు సముద్రంలో 200 నాటికల్ మైళ్ల దూరం గాలించి ఈ పడవను పట్టుకున్నారని ఓ ఉన్నతాధికారి చెప్పారు. మరోవైపు 8 నాటికల్ మైళ్లపాటు భారత జలాల్లోకి ప్రవేశించి చేపలు పడుతున్న ‘అల్-మదీనా’ అనే మరో పడవను కూడా ఐసీజీ గుర్తించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 600 కోట్ల డ్రగ్స్ ఉన్న పాక్ పడవ పట్టివేత
ఎప్పుడు : మే 21
ఎవరు : భారత తీరప్రాంత భద్రతాదళం (ఇండియన్ కోస్ట్ గార్డ్-ఐసీజీ)
ఎక్కడ : గుజరాత్ తీరం
క్విక్ రివ్యూ :
ఏమిటి : 600 కోట్ల డ్రగ్స్ ఉన్న పాక్ పడవ పట్టివేత
ఎప్పుడు : మే 21
ఎవరు : భారత తీరప్రాంత భద్రతాదళం (ఇండియన్ కోస్ట్ గార్డ్-ఐసీజీ)
ఎక్కడ : గుజరాత్ తీరం
Published date : 22 May 2019 06:07PM