Skip to main content

2020 నుంచి ఐఎస్‌ఎస్ యాత్రలు

అంతరిక్ష పర్యాటకం, తదితర వాణిజ్య అవసరాల కోసం 2020నాటికి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని(ఐఎస్‌ఎస్) సిద్ధం చేయనున్నట్లు నాసా ప్రకటించింది.
కక్షలో తిరుగుతున్న ఈ ఉపగ్రహంలో ఒక్క రాత్రి గడపాలనుకునే వారి నుంచి 35 వేల డాలర్లు(రూ.24 లక్షలు) చొప్పున వసూలు చేస్తామని తెలిపింది. మొత్తం రానుపోను చార్జీలతో కలిపి ఒక్కొక్కరికి రూ.400 కోట్ల వరకు ఖర్చవుతుందని వివరించింది. అంతరిక్ష కేంద్రం నిర్వహణలో ఎదురవుతున్న ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు ఈ ప్రయత్నం దోహదపడుతుందని నాసా భావిస్తోంది. అమెరికాకు చెందిన వ్యాపారవేత్త డెన్నిస్ టిటో మొట్టమొదటిసారిగా అంతరిక్షంలోకి వెళ్లిన యాత్రికుడు. ఇందుకు రష్యాకు టిటో రూ.138 కోట్లు చెల్లించారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
2020 నుంచి ఐఎస్‌ఎస్ యాత్రలు
ఎప్పుడు : జూన్ 7
ఎవరు : నాసా
Published date : 08 Jun 2019 06:16PM

Photo Stories