2019-20 ఏడాదిలో జీడీపీ వృద్ధి 4.2 శాతం
Sakshi Education
2019 ఏప్రిల్ -2020 మార్చి ఆర్థిక సంవత్సరంలో భారత స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు 4.2 శాతం నమోదయ్యింది.
తలసరి ఆదాయంలో 6.1 శాతం వృద్ధి
జీడీపీ లెక్కప్రకారం, తలసరి ఆదాయం 2018-19లో రూ.1,26,521గా ఉంది. ఇది 2019-20లో(ప్రస్తుత ధరల ఆధారంగా) రూ.1,34,226కు చేరింది. దీంతో వృద్ధి 6.1 శాతంగా నమోదైంది.
కట్టు తప్పిన ద్రవ్యలోటు...
తాజా లెక్కల ప్రకారం మొత్తం జీడీపీలో ద్రవ్యలోటు (ప్రభుత్వ ఆదాయ, వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం) 4.6 శాతంగా నమోదయి్యంది. వాస్తవానికి 2019-20 ఏడాది మొత్తం జీడీపీలో ద్రవ్యలోటు 3.8 శాతం దాటకూడదని సవరిత అంచనాలు నిర్దేశిస్తున్నాయి. సవరించకముందు ఇది ఇంకా తక్కువగా 3.3 శాతంగానే ఉంది. ఇక రెవెన్యూలోటు కేవలం 2.4 శాతమే (జీడీపీ విలువలో) ఉండాలని భావిస్తే, ఇది తాజా లెక్కల ప్రకారం 3.27 శాతానికి చేరింది.
41 సంవత్సరాల తర్వాత...
నిపుణుల అంచనాల ప్రకారం కరోనా నేపథ్యంలో భారత్ 2020-21 ఆర్థిక సంవత్సరం 41 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి మాంద్యం పరిస్థితిలోకి జారిపోనుంది. 1958, 1966, 1980 ఆర్థిక సంవత్సరాల్లో మూడుసార్లు దేశం మాంద్యాన్ని ఎదుర్కొంది. ఈ మూడు సందర్భాల్లోనూ వర్షపాతం సరిగా లేక, అప్పట్లో ఆర్థిక వ్యవస్థలో కీలకమైన వ్యవసాయం దెబ్బతినడమే కారణం. వరుసగా రెండు త్రైమాసికాల్లో ఆర్థిక వ్యవస్థలో అసలు వృద్ధిలేకపోగా, మైనస్ (క్షీణత) గనుక నమోదయితే దానిని మాంద్యంగా పరిగణిస్తారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2019-20 ఏడాదిలో జీడీపీ వృద్ధి 4.2 శాతం
ఎప్పుడు : మే 29
ఎవరు : జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ)

ఈ మేరకు జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) మే 29న జీడీపీ గణాంకాలను విడుదల చేసింది. 2018-19లో దేశ జీడీపీ వృద్ధిరేటు 6.1 శాతంగా నమోదైన విషయం తెలిసిందే. ఎన్ఎస్ఓ గణాంకాల ప్రకారం...
2019-2020 ఏడాది వృద్ధి రేటు
మొదటి త్రైమాసికం (ఏప్రిల్-జూన్) | 5.2 శాతం |
రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్) | 4.4 శాతం |
మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్) | 4.1 శాతం |
నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి) | 3.1 శాతం |
2019-2020 ఏడాది (ఏప్రిల్-మార్చి) | మొత్తం 4.2 శాతం |
తలసరి ఆదాయంలో 6.1 శాతం వృద్ధి
జీడీపీ లెక్కప్రకారం, తలసరి ఆదాయం 2018-19లో రూ.1,26,521గా ఉంది. ఇది 2019-20లో(ప్రస్తుత ధరల ఆధారంగా) రూ.1,34,226కు చేరింది. దీంతో వృద్ధి 6.1 శాతంగా నమోదైంది.
కట్టు తప్పిన ద్రవ్యలోటు...
తాజా లెక్కల ప్రకారం మొత్తం జీడీపీలో ద్రవ్యలోటు (ప్రభుత్వ ఆదాయ, వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం) 4.6 శాతంగా నమోదయి్యంది. వాస్తవానికి 2019-20 ఏడాది మొత్తం జీడీపీలో ద్రవ్యలోటు 3.8 శాతం దాటకూడదని సవరిత అంచనాలు నిర్దేశిస్తున్నాయి. సవరించకముందు ఇది ఇంకా తక్కువగా 3.3 శాతంగానే ఉంది. ఇక రెవెన్యూలోటు కేవలం 2.4 శాతమే (జీడీపీ విలువలో) ఉండాలని భావిస్తే, ఇది తాజా లెక్కల ప్రకారం 3.27 శాతానికి చేరింది.
41 సంవత్సరాల తర్వాత...
నిపుణుల అంచనాల ప్రకారం కరోనా నేపథ్యంలో భారత్ 2020-21 ఆర్థిక సంవత్సరం 41 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి మాంద్యం పరిస్థితిలోకి జారిపోనుంది. 1958, 1966, 1980 ఆర్థిక సంవత్సరాల్లో మూడుసార్లు దేశం మాంద్యాన్ని ఎదుర్కొంది. ఈ మూడు సందర్భాల్లోనూ వర్షపాతం సరిగా లేక, అప్పట్లో ఆర్థిక వ్యవస్థలో కీలకమైన వ్యవసాయం దెబ్బతినడమే కారణం. వరుసగా రెండు త్రైమాసికాల్లో ఆర్థిక వ్యవస్థలో అసలు వృద్ధిలేకపోగా, మైనస్ (క్షీణత) గనుక నమోదయితే దానిని మాంద్యంగా పరిగణిస్తారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2019-20 ఏడాదిలో జీడీపీ వృద్ధి 4.2 శాతం
ఎప్పుడు : మే 29
ఎవరు : జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ)
Published date : 30 May 2020 06:03PM