Skip to main content

17 వేల కోట్ల ఆర్థిక సాయం చేయాలి : ఒడిశా

ఫొని తుపాను కారణంగా నష్టపోయిన తమ రాష్ట్రానికి రూ.17 వేల కోట్ల ఆర్థిక సాయం అందజేయాలని కేంద్రప్రభుత్వాన్ని ఒడిశా సర్కార్ కోరింది.
 మ‌రోవైపు ఫొని కారణంగా రాష్ట్రంలో ఇప్పటిదాకా 35 మంది మృతి చెందినట్లు మే 7న తెలిపింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని పేర్కొంది. మే 3న సంభవించిన ఫొని తుపాను పూరి జిల్లాలో అత్యధికంగా 21 మంది ప్రాణాలు కోల్పోయారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 17 వేల కోట్ల ఆర్థిక సాయం చేయాలి
ఎప్పుడు : మే 7
ఎవరు : ఒడిశా ప్రభుత్వం
ఎందుకు : ఫొని తుపాను కారణంగా నష్టపోయినందుకు
Published date : 08 May 2019 05:45PM

Photo Stories