Scientist: గోల్డెన్ పీకాక్ ఎకో ఇన్నోవేషన్–2021 అవార్డు విజేత?
గ్రేటర్ నొయిడాలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ పరిశోధన, అభివృద్ధి కేంద్రం (ఆర్ అండ్ డీ) డిప్యూటీ జనరల్ మేనేజర్గా పనిచేస్తున్న తెనాలి శాస్త్రవేత్త డాక్టర్ తోట చిరంజీవి ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ పీకాక్ ఎకో ఇన్నోవేషన్–2021 అవార్డు లభించింది. డిసెంబర్ 10న వర్చువల్ విధానం ద్వారా జరిగిన కార్యక్రమంలో డాక్టర్ చిరంజీవికి ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (ఐఓడీ) ఈ అవార్డును ప్రదానం చేసింది. భారత్ జీఎస్సార్ క్యాట్ను అభివృద్ధి చేసినందుకుగాను ఆయనకు ఈ అవార్డు దక్కింది.
రిఫైనరీలో వెలువడే వ్యర్థాలను విలువైన మెటీరియల్గా మార్చే, పర్యావరణ సమస్యలను పరిష్కరించే భారత్ జీఎస్సార్ క్యాట్ అనే ఉత్ప్రేరకాన్ని డాక్టర్ చిరంజీవి, ఆయన బృందం అభివృద్ధి చేసింది. వీరు అభివృద్ధి చేసిన గ్యాసోలిన్ సల్ఫర్ తగ్గింపు ఉత్ప్రేరకం (భారత్ జీఎస్సార్ క్యాట్) ప్రయోగశాలలో విస్తృతమైన పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలతో భారతదేశంలో తొలిసారిగా చేసిన ఒక ప్రత్యేకమైన ఉత్పత్తి. దీనిని భారీస్థాయిలో ఉత్పత్తి చేసి, భారతీయ రిఫైనరీల్లో విజయవంతంగా ఉపయోగిస్తున్నారు.
చదవండి: వరల్డ్ బెస్ట్ టూరిజం విలేజ్గా ఎంపికైన గ్రామం?
క్విక్ రివ్యూ :
ఏమిటి : గోల్డెన్ పీకాక్ ఎకో ఇన్నోవేషన్–2021 అవార్డు విజేత?
ఎప్పుడు : డిసెంబర్ 10
ఎవరు : శాస్త్రవేత్త డాక్టర్ తోట చిరంజీవి
ఎందుకు : భారత్ జీఎస్సార్ క్యాట్ను అభివృద్ధి చేసినందుకుగాను..
డౌన్లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్లోడ్ ఇలా...
డౌన్లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్