Skip to main content

Padma Awards: పద్మ అవార్డులు అందుకున్న నాగేశ్వర్​రెడ్డి, బాలకృష్ణ

దేశంలోని పలు రంగాల్లో విశిష్ట సేవలు అందించిన పలువురు ప్రముఖులు ఏప్రిల్ 28వ తేదీ న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో పద్మ పురస్కారాలు అందుకున్నారు.
President Murmu presents the Padma awards to 71 personalities

ఏపీ, తెలంగాణకు చెందిన వారికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులు ప్రదానం చేశారు. రాష్ట్రపతి మొత్తం నలుగురికి పద్మ విభూషణ్, 10 మందికి పద్మ భూషణ్, 57 మందికి పద్మశ్రీలు ప్రదానం చేశారు. 

వైద్యరంగంలో ప్రముఖ వైద్యుడు డాక్టర్‌ దువ్వూరి నాగేశ్వర్‌రెడ్డి (పద్మవిభూషణ్‌), కళారంగంలో నందమూరి బాలకృష్ణ (పద్మభూషణ్‌), మాడుగుల నాగఫణిశర్మ, ప్రజా వ్యవహారాల విభాగంలో మందకృష్ణ, విద్య, సాహిత్యం విభాగంలో కేఎల్‌ కృష్ణ, విద్య, సాహిత్యం విభాగంలో రాఘవేంద్రాచార్య (పద్మశ్రీ) పురస్కారాలు అందుకున్నారు. మిరియాల అప్పారావు (పద్మశ్రీ) తరఫున ఆయన కుమార్తె యడవల్లి శ్రీదేవి అవార్డు స్వీకరించారు.
 
కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏడుగురికి పద్మ విభూషణ్, 19 పద్మ భూషణ్, 113 పద్మ శ్రీ పురస్కారాలు ప్రకటించింది. ఈ పురస్కార గ్రహీతలలో 23 మంది మహిళలు, 10 మంది విదేశీయులు/ఎన్ఆర్ఐ/పీఐఓ/ఓసీఐ వర్గానికి చెందినవారు, 13 మంది మరణాంతర పురస్కార గ్రహీతలు ఉన్నారు.  

National Award: జాతీయ అవార్డును అందుకున్న గొల్లపూడి పంచాయతీ కార్యదర్శి

Published date : 29 Apr 2025 01:58PM

Photo Stories