మే 2019 అవార్డ్స్
Sakshi Education
అల్హార్తికి మాన్ బుకర్ బహుమతి
సాహిత్యరంగంలో అందించే ప్రఖ్యాత మాన్బుకర్ ప్రైజ్ 2019కిగానూ ఓ అరబ్ మహిళను వరించింది. ఒమన్కు చెందిన రచయిత్రి జోఖా అల్హార్తి(40) రాసిన ‘సెలస్టియల్ బాడీ’ నవలకు ఈసారి మాన్ బుకర్ ప్రైజ్ దక్కింది. లండన్లోని రౌండ్హౌస్లో బుకర్ప్రైజ్ను అందుకున్న అల్హార్తి.. ఈ అవార్డును గెలుచుకున్న తొలి అరబ్ మహిళగా చరిత్ర సృష్టించారు. బ్రిటన్ నుంచి 1951లో స్వాతంత్య్రం పొందాక ఒమన్లో చోటుచేసుకున్న మార్పులను, బానిసత్వం పరిస్థితులను ఈ నవలలో అల్హార్తి వర్ణించారు. ఈ అవార్డు కింద అందే రూ.44.60 లక్షల(64,000 డాలర్ల)ను అల్హార్తి, అనువాదకురాలు మార్లిన్ చెరిసగం పంచుకోనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: అల్హార్తికి మాన్ బుకర్ బహుమతి ప్రదానం
ఎవరు: అల్హార్తి
ఎందుకు: ‘సెలస్టియల్ బాడీ’ నవలకు
ఎక్కడ: లండన్
దక్షిణ డిస్కంకు స్మార్ట్ సిటీస్ పురస్కారం
దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)కు స్మార్ట్ సిటీస్ పురస్కారం లభించింది. ఢిల్లీలో మే 24న జరిగిన ఐదో స్మార్ట్ సిటీస్ సదస్సు కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని డిస్కం సీఎండీ రఘుమారెడ్డి అందుకున్నారు. పర్యావరణ అనుకూల ఇంధన ఉత్పత్తిని ప్రోత్సహించడంలో ఈ సంస్థ దేశంలోనే ఉత్తమ పనితీరు కనబరుస్తున్నందుకు ఈ పురస్కారానికి ఎంపికై ంది. ‘అండ్ గ్రీన్ సిటీ అవార్డు’ విభాగంలో దక్షిణ డిస్కంకు ఈ పురస్కారం లభించింది. రూఫ్టాప్ సౌరవిద్యుత్ ఏర్పాటును ప్రోత్సహిస్తున్నందుకు గతంలోనూ 4 జాతీయ స్థాయి పురస్కారాలను డిస్కం గెలుచుకుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : స్మార్ట్ సిటీస్ పురస్కారం
ఎప్పుడు : మే 24
ఎవరు : దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)
ఎందుకు : పర్యావరణ అనుకూల ఇంధన ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నందుకు
పతంజలి గ్రూపునకు యూఎన్ఎస్డీజీ అవార్డు
పతంజలి గ్రూపును యూఎన్ఎస్డీజీ హెల్త్కేర్ పురస్కారం వరించింది. స్విట్జర్లాండ్లోని జెనీవాలో మే 25న జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో పతంజలి గ్రూపు సంస్థల మేనేజింగ్ డెరైక్టర్ ఆచార్య బాలకృష్ణ ఈ అవార్డును అందుకున్నారు. ఆరోగ్య రక్షణలో ప్రపంచంలో అత్యంత ప్రభావవంతులైన 10 మందికి ఐక్యరాజ్య సమితి అభివృద్ధి లక్ష్యాల విభాగం యూఎన్ఎస్డీజీ ఏటా ఈ అవార్డుల ప్రదానం చేస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : యూఎన్ఎస్డీజీ హెల్త్కేర్ పురస్కారం
ఎప్పుడు : మే 25
ఎవరు : పతంజలి గ్రూపు
ఎందుకు : ఆరోగ్య రక్షణలో కృషిచేసినందుకు
ఎస్పీడీసీఎల్కు షైనింగ్ గ్లోరీ అవార్డు
విద్యుత్తు వినియోగదారులకు మెరుగైన సేవలు అందించినందుకుగాను ఏపీఎస్పీడీసీఎల్కు షైనింగ్ గ్లోరీ అవార్డు-2019 లభించింది. చండీగఢ్ సమీపంలోని జీరక్పుర్ పట్టణంలో గ్రీన్ మ్యాపల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును అందజేశారు. విద్యుత్తు పొదుపు, పునరుత్పాదన ఇంధన వనరులను ప్రోత్సహించడంలో ఎస్పీడీసీఎల్ చేస్తున్న కృషికి జాతీయ స్థాయిలో మొదటి స్థానం లభించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : షైనింగ్ గ్లోరీ అవార్డు-2019 విజేత
ఎప్పుడు : మే 27
ఎవరు : ఏపీఎస్పీడీసీఎల్
ఎందుకు : వినియోగదారులకు మెరుగైన సేవలు అందించినందుకుగాను
సీతంపేట ఐటీడీఏకు ఐఎస్వో గుర్తింపు
శ్రీకాకుళం జిల్లాలోని సీతంపేట సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ)కు అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ (ఐఎస్వో) గుర్తింపు లభించింది. పారదర్శకమైన, క్రమశిక్షణతో కూడిన పాలన అందించినందుకుగాను ఈ గుర్తింపు లభించిందని ఐటీడీఏ పీవో ఎల్.శివశంకర్ తెలిపారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో మే 27న జరిగిన కార్యక్రమంలో.. క్వెస్ట్ సర్టిఫికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ (చెన్నై) డెరైక్టర్ బి.కార్తికేయన్ నుంచి ఐఎస్వో 9001:2015 ధ్రువపత్రాన్ని ఆయన అందుకున్నారు. సీతంపేట ఐటీడీఏ పరిధిలోని గిరిజనులకు అందుతున్న వివిధ సేవలను రెండు నెలల పాటు పరిశీలించిన అనంతరం ఐఎస్వో గుర్తింపునకు ఎంపిక చేశామని కార్తికేయన్ తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ (ఐఎస్వో) గుర్తింపు
ఎప్పుడు : మే 27
ఎవరు : సీతంపేట సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ)
ఎక్కడ : శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్
ఎందుకు : పారదర్శకమైన, క్రమశిక్షణతో కూడిన పాలన అందించినందుకుగాను
భారతీ ఆక్సా లైఫ్కు ఫిక్కీ అవార్డు
బీమా సంస్థ భారతీ ఆక్సా లైఫ్ ఇన్సూరెన్స్ కు ఫిక్కీ నుంచి క్లెయిమ్స్ ఎక్సలెన్సీ అవార్డు లభించింది. ఇటీవల ఫిక్కీ నిర్వహించిన 20వ వార్షిక బీమా సదస్సు ’ఫిన్ కాస్ 2019’లో ఈ అవార్డును దక్కించుకున్నట్లు ఆక్సా లైఫ్ సంస్థ తెలిపింది. వినియోగదారుల స్నేహపూర్వక క్లెయిమ్స్ సేవలకు గాను ఫిక్కీ అవార్డుతో సత్కరించినట్లు పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఫిక్కీ క్లెయిమ్స్ ఎక్సలెన్సీ అవార్డు
ఎప్పుడు : మే 28
ఎవరు : భారతీ ఆక్సా లైఫ్ ఇన్సూరెన్స్
ఎందుకు : వినియోగదారుల స్నేహపూర్వక క్లెయిమ్స్ సేవలకు గాను
ఆండీ ముర్రేకు సర్ బిరుదు
మూడు గ్రాండ్స్లామ్ టోర్నీలు, రెండు ఒలింపిక్ స్వర్ణాల విజేత అయిన టెన్నిస్ స్టార్ ఆండీ ముర్రేను బ్రిటన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘సర్’ బిరుదుతో సత్కరించింది. మే 16న జరిగిన కార్యక్రమంలో ముర్రేకు ప్రిన్స్ చార్లెస్ ‘నైట్హుడ్’ పురస్కారాన్ని అందజేశారు. 2013లో వింబుల్డన్ గెలిచి 77 ఏళ్ల తర్వాత ఈ ఘనత సాధించిన బ్రిటన్ ఆటగాడిగా గుర్తింపు పొందిన ముర్రే 2016లో ఇదే టైటిల్ను గెలుచుకున్నాడు. అంతకు ముందు 2012లో అతను యూఎస్ ఓపెన్ నెగ్గాడు. 2012 లండన్, 2016 రియో ఒలింపిక్స్లలో స్వర్ణాలు సాధించిన ముర్రే... ఇటీవల వరుస గాయాలతో ఆటకు దూరమయ్యాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బ్రిటన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘సర్’ బిరుదు
ఎప్పుడు : మే 16
ఎవరు : ఆండీ ముర్రే
ఉత్తమ వర్సిటీగా వీఐటీకి యునికా పురస్కారం
భారత్లో ఉత్తమ విశ్వవిద్యాలయంగా వేలూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వీఐటీ)కి యునికా పురస్కారం లభించింది. ఈ మేరకు ఐరోపాలో ఉన్న విశ్వవిద్యాలయాల సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పడిన యునికా సంస్థ వీఐటీని ఎంపిక చేసింది. బెల్జియం రాజధాని బ్రషల్స్ కేంద్రంగా కొనసాగుతున్న యునికా అంతర్జాతీయ స్థాయి విశ్వవిద్యాలయాలతో కలిసి ప్రపంచ స్థాయిలో ఉన్నత విద్యను అందించడానికి సూచనలు చేస్తుంది. ఏటా ప్రపంచ స్థాయిలో నాణ్యమైన ఉన్నత విద్యను అందించే వర్సిటీని ఎంపికచేసి పురస్కారం అందజేస్తోంది. సంస్థ వార్షిక సమావేశం ఇటీవల దిల్లీలో జరిగింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఉత్తమ వర్సిటీగా వీఐటీకి యునికా పురస్కారం
ఎప్పుడు : మే 16
ఎక్కడ : భారత్
పిసిటి హ్యూమానిటికి గిన్నిస్ బుక్లో స్థానం
జోగిందర్ సింగ్ సలారియా అనే భారతీయుడు నిర్వహిస్తున్న పిసిటి హ్యూమానిటి అనే దాతృత్వ సంస్థకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం లభించింది. రంజాన్ మాసంలో దుబాయ్ ప్రజలకు ప్రతిరోజూ శాఖాహార ఇఫ్తార్ను అందిస్తున్నందుకు పిసిటికి గిన్నిస్లో చోటు దక్కింది. యూఏఈలో మే 18న ‘లాంగెస్ట్ లైన్ ఆఫ్ హంగర్ రిలీఫ్ ప్యాకేజ్’గా గిన్నిస్ బుక్లో నమోదైంది. ప్రజలకు స్వచ్ఛమైన శాఖాహారాన్ని అందించి వారిని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా, జంతువులను పరిరక్షించే లక్ష్యంతో ఇఫ్తార్ కార్యక్రమాన్ని చేపట్టామని సలారియా తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం
ఎప్పుడు : మే 18
ఎవరు : జోగిందర్ సింగ్ సలారియా (పిసిటి హ్యూమానిటి)
ఎక్కడ : దుబాయ్, యూఏఈ
ఎందుకు : ఇఫ్తార్ను అందిస్తున్నందుకు
కీడ్స్కు రాజీవ్గాంధీ సమాజ్ రత్న అవార్డు
వరంగల్ కేంద్రంగా పనిచేస్తున్న కాకతీయ ఎడ్యుకేషన్ ఎన్వైర్మెంట్ ఎకనమిక్ డెవలప్మెంట్ సొసైటీ(కీడ్స) స్వచ్ఛంద సంస్థకు రాజీవ్గాంధీ సమాజ్ రత్న అవార్డు లభించింది. రాజీవ్గాంధీ వర్ధంతి సందర్భంగా ఢిల్లీలో మే 21న జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును ఈ సంస్థకు అందజేశారు. సమాజ సేవకు పాటుపడుతున్న పలు సంస్థలు, వ్యక్తులకు రాజీవ్గాంధీ సమాజ్ రత్న అవార్డును అందజేస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రాజీవ్గాంధీ సమాజ్ రత్న అవార్డు
ఎప్పుడు : మే 21
ఎవరు : కాకతీయ ఎడ్యుకేషన్ ఎన్వైర్మెంట్ ఎకనమిక్ డెవలప్మెంట్ సొసైటీ(కీడ్స)
భారత పోలీసు అధికారికి ఐరాస పురస్కారం
శాంతి పరిరక్షణలో అసువులు బాసిన భారతదేశ పోలీసు అధికారి జితేందర్ కుమార్కు ఐక్యరాజ్యసమితి హామర్షల్డ్ పురస్కారాన్ని ప్రదానం చేయనుంది. అంతర్జాతీయ శాంతిస్థాపకుల దినోత్సవం సందర్భంగా మే 24న ఐరాసలో జరిగే కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందజేయనున్నారు. కాంగో దేశంలో సేవలు అందిస్తూ జితేందర్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది విధి నిర్వహణలో మరణించిన మొత్తం 119 మంది మిలటరీ, పోలీసు అధికారులకు ఐరాస హామర్షల్డ్ పురస్కారాన్ని అందజేయనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐక్యరాజ్యసమితి హామర్షల్డ్ పురస్కారాం
ఎప్పుడు : మే 21
ఎవరు : జితేందర్ కుమార్
గుంటూరు వైద్యుడికి అంతర్జాతీయ అవార్డు
గుంటూరుకు చెందిన వెన్నెముక శస్త్రచికిత్స నిపుణుడు, మల్లిక స్పైన్ సెంటర్ అధినేత డాక్టర్ జె. నరేష్బాబుకు అంతర్జాతీయ అవార్డు లభించింది. కెనడాలో మే 16న జరిగిన కార్యక్రమంలో నరేష్ సహా 11 మందికి డిస్కవరీ అండ్ ఇన్నొవేషన్ అవార్డును అందజేశారు. వెన్నెముక ఆపరేషన్ ఇన్ఫెక్షన్స్ పై చేసిన పరిశోధనలకు గాను నరేష్కు ఈ అవార్డు దక్కింది. స్విట్జర్లాండ్కు చెందిన ఏఓ స్పైన్ ఇంటర్నేషనల్ సంస్థ వెన్నెముకకు సంబంధించి జరిగే ఒరిజనల్ రీసెర్చికు ప్రోత్సాహం ఇచ్చేందుకు డిస్కవరీ అండ్ ఇన్నొవేషన్ అవార్డును అందిస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : డిస్కవరీ అండ్ ఇన్నొవేషన్ అవార్డు
ఎప్పుడు : మే 16
ఎవరు : డాక్టర్ జె. నరేష్బాబు
ఎక్కడ : కెనడా
అభినందన్ స్క్వాడ్రన్కు స్లేయర్స్ బ్యాడ్జీ
భారత వింగ్ కమాండర్ అభినందన్కు చెందిన 51 స్క్వాడ్రన్ వైమానిక దళానికి ‘ఫాల్కన్ స్లేయర్స్’ ‘అమ్రామ్ డాడ్చర్స్’ బ్యాడ్జీలు లభించాయి. పాకిస్తాన్కి చెందిన అత్యాధునిక ఎఫ్-16 విమానాలతో పాటు అమ్రామ్ క్షిపణులను స్క్వాడ్రన్ 51 దీటుగా తిప్పికొట్టినందుకు ఈ బ్యాడ్జీలను జారీ చేసినట్లు భారత వైమానిక దళం తెలిపింది. పాక్లోని జైషే ఉగ్రస్థావరంపై ఫిబ్రవరి 27న వైమానిక దాడుల అనంతరం భారత్లోకి దూసుకొచ్చిన పాక్ ఎఫ్-16 యుద్ధవిమానాలను స్క్వాడ్రన్ 51 తిప్పికొట్టింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఫాల్కన్ స్లేయర్స్, అమ్రామ్ డాడ్చర్స్ బ్యాడ్జీలు జారీ
ఎప్పుడు : మే 15
ఎవరు : 51 స్క్వాడ్రన్ వైమానిక దళం
ఎందుకు : పాక్కి చెందిన ఎఫ్-16 విమానాలతో పాటు అమ్రామ్ క్షిపణులను తిప్పికొట్టినందుకు
రవిశంకర్కు సెయింట్ జార్జ్ అవార్డు
ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు, యోగా గురువు శ్రీశ్రీ రవిశంకర్కు ‘ఆర్డర్ ఆఫ్ సెయింట్ జార్జ్’ అవార్డు లభించింది. సెయింట్ గీవర్ఘీస్ సంస్మరణ సభలో ఈ అవార్డును అందజేయనున్నారు. కేరళలోని కొట్టాయం జిల్లా పుత్తుపల్లిలోని సెయింట్ జార్జ్ ఆర్థోడాక్స్ చర్చిలో మే 5న నిర్వహించే ఈ సభను కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ ప్రారంభించనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆర్డర్ ఆఫ్ సెయింట్ జార్జ్ అవార్డు
ఎప్పుడు : మే 2
ఎవరు : శ్రీశ్రీ రవిశంకర్
నగెన్ సైకియాకు ఎన్టీఆర్ పురస్కారం
ప్రముఖ అస్సామీ కథకుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు, అస్సామీ పత్రికల సంపాదకుడు నగెన్ సైకియాకు ఎన్టీఆర్ జాతీయ సాహితీ పురస్కారం-2019 లభించింది. ఈ మేరకు ఎన్టీఆర్ పురస్కారానికి నగెన్ను ఎంపికచేసినట్లు ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు డాక్టర్ నందమూరి లక్ష్మీ పార్వతి మే 2న వెల్లడించారు. ఎన్టీఆర్ జయంతి రోజైన 28న ఈ పురస్కారాన్ని ప్రధానం చేయనున్నట్లు పేర్కొన్నారు. 2006లో ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ను స్థాపించగా 2007 నుంచి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన 26 భాషల్లోని ప్రముఖులకు ఏటా పురస్కారాలు అందజేస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎన్టీఆర్ జాతీయ సాహితీ పురస్కారం-2019
ఎప్పుడు : మే 2
ఎవరు : నగెన్ సైకియా
ఎనిమిది టీటీడీ సంస్థలకు ఐఎస్ఓ గుర్తింపు
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎనిమిది సంస్థలకు మే 4న ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ (ఐఎస్ఓ) గుర్తింపు లభించింది. దీంతో ఐఎస్ఓ గుర్తింపు టీటీడీ సంస్థల సంఖ్య తొమ్మిదికి చేరింది. తిరుపతిలోని మాధవం వసతి సముదాయంతో పాటు ఎస్పీడబ్ల్యూ పాలిటెక్నిక్, శ్రీ పద్మావతి జూనియర్ కళాశాల, ఎస్వీ జూనియర్ కళాశాల, కుప్పం, రాజాం, నర్సాపూర్, మహబూబ్నగర్, బెంగళూరులోని టీటీడీ కల్యాణ మండపాలకు ఐఎస్ఓ గుర్తింపునిచ్చింది. అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించడం వల్లే వీటికి గుర్తింపు దక్కిందని టీటీడీ ఈవో అనిల్కుమార్ సింఘాల్ తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎనిమిది టీటీడీ సంస్థలకు ఐఎస్ఓ గుర్తింపు
ఎప్పుడు : మే 4
ఎవరు : ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ (ఐఎస్ఓ)
ఎందుకు : అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించినందుకు
తెలంగాణ వ్యవసాయశాఖకు సీఎస్ఐ అవార్డు
తెలంగాణ వ్యవసాయశాఖకు ప్రతిష్టాత్మక కంప్యూటర్ సైన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా (సీఎస్ఐ) నిహిలెంట్ ఇ-గవర్నెన్స్ అవార్డు లభించింది. 2017-18 సంవత్సరానికి స్పెషల్ ఇన్నోవేటివ్ గ్రూప్ కింద వ్యవసాయశాఖ విత్తన విభాగానికి ఈ అవార్డు దక్కింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు నాణ్యమైన, మేలు రకాల విత్తనాలను ఆన్లైన్లో రాయితీపై రెండేళ్లుగా అందజేస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సీఎస్ఐ నిహిలెంట్ ఇ-గవర్నెన్స్ అవార్డు
ఎప్పుడు : మే 4
ఎవరు : తెలంగాణ వ్యవసాయశాఖ

క్విక్ రివ్యూ:
ఏమిటి: అల్హార్తికి మాన్ బుకర్ బహుమతి ప్రదానం
ఎవరు: అల్హార్తి
ఎందుకు: ‘సెలస్టియల్ బాడీ’ నవలకు
ఎక్కడ: లండన్
దక్షిణ డిస్కంకు స్మార్ట్ సిటీస్ పురస్కారం
దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)కు స్మార్ట్ సిటీస్ పురస్కారం లభించింది. ఢిల్లీలో మే 24న జరిగిన ఐదో స్మార్ట్ సిటీస్ సదస్సు కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని డిస్కం సీఎండీ రఘుమారెడ్డి అందుకున్నారు. పర్యావరణ అనుకూల ఇంధన ఉత్పత్తిని ప్రోత్సహించడంలో ఈ సంస్థ దేశంలోనే ఉత్తమ పనితీరు కనబరుస్తున్నందుకు ఈ పురస్కారానికి ఎంపికై ంది. ‘అండ్ గ్రీన్ సిటీ అవార్డు’ విభాగంలో దక్షిణ డిస్కంకు ఈ పురస్కారం లభించింది. రూఫ్టాప్ సౌరవిద్యుత్ ఏర్పాటును ప్రోత్సహిస్తున్నందుకు గతంలోనూ 4 జాతీయ స్థాయి పురస్కారాలను డిస్కం గెలుచుకుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : స్మార్ట్ సిటీస్ పురస్కారం
ఎప్పుడు : మే 24
ఎవరు : దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)
ఎందుకు : పర్యావరణ అనుకూల ఇంధన ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నందుకు
పతంజలి గ్రూపునకు యూఎన్ఎస్డీజీ అవార్డు
పతంజలి గ్రూపును యూఎన్ఎస్డీజీ హెల్త్కేర్ పురస్కారం వరించింది. స్విట్జర్లాండ్లోని జెనీవాలో మే 25న జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో పతంజలి గ్రూపు సంస్థల మేనేజింగ్ డెరైక్టర్ ఆచార్య బాలకృష్ణ ఈ అవార్డును అందుకున్నారు. ఆరోగ్య రక్షణలో ప్రపంచంలో అత్యంత ప్రభావవంతులైన 10 మందికి ఐక్యరాజ్య సమితి అభివృద్ధి లక్ష్యాల విభాగం యూఎన్ఎస్డీజీ ఏటా ఈ అవార్డుల ప్రదానం చేస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : యూఎన్ఎస్డీజీ హెల్త్కేర్ పురస్కారం
ఎప్పుడు : మే 25
ఎవరు : పతంజలి గ్రూపు
ఎందుకు : ఆరోగ్య రక్షణలో కృషిచేసినందుకు
ఎస్పీడీసీఎల్కు షైనింగ్ గ్లోరీ అవార్డు
విద్యుత్తు వినియోగదారులకు మెరుగైన సేవలు అందించినందుకుగాను ఏపీఎస్పీడీసీఎల్కు షైనింగ్ గ్లోరీ అవార్డు-2019 లభించింది. చండీగఢ్ సమీపంలోని జీరక్పుర్ పట్టణంలో గ్రీన్ మ్యాపల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును అందజేశారు. విద్యుత్తు పొదుపు, పునరుత్పాదన ఇంధన వనరులను ప్రోత్సహించడంలో ఎస్పీడీసీఎల్ చేస్తున్న కృషికి జాతీయ స్థాయిలో మొదటి స్థానం లభించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : షైనింగ్ గ్లోరీ అవార్డు-2019 విజేత
ఎప్పుడు : మే 27
ఎవరు : ఏపీఎస్పీడీసీఎల్
ఎందుకు : వినియోగదారులకు మెరుగైన సేవలు అందించినందుకుగాను
సీతంపేట ఐటీడీఏకు ఐఎస్వో గుర్తింపు
శ్రీకాకుళం జిల్లాలోని సీతంపేట సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ)కు అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ (ఐఎస్వో) గుర్తింపు లభించింది. పారదర్శకమైన, క్రమశిక్షణతో కూడిన పాలన అందించినందుకుగాను ఈ గుర్తింపు లభించిందని ఐటీడీఏ పీవో ఎల్.శివశంకర్ తెలిపారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో మే 27న జరిగిన కార్యక్రమంలో.. క్వెస్ట్ సర్టిఫికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ (చెన్నై) డెరైక్టర్ బి.కార్తికేయన్ నుంచి ఐఎస్వో 9001:2015 ధ్రువపత్రాన్ని ఆయన అందుకున్నారు. సీతంపేట ఐటీడీఏ పరిధిలోని గిరిజనులకు అందుతున్న వివిధ సేవలను రెండు నెలల పాటు పరిశీలించిన అనంతరం ఐఎస్వో గుర్తింపునకు ఎంపిక చేశామని కార్తికేయన్ తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ (ఐఎస్వో) గుర్తింపు
ఎప్పుడు : మే 27
ఎవరు : సీతంపేట సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ)
ఎక్కడ : శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్
ఎందుకు : పారదర్శకమైన, క్రమశిక్షణతో కూడిన పాలన అందించినందుకుగాను
భారతీ ఆక్సా లైఫ్కు ఫిక్కీ అవార్డు
బీమా సంస్థ భారతీ ఆక్సా లైఫ్ ఇన్సూరెన్స్ కు ఫిక్కీ నుంచి క్లెయిమ్స్ ఎక్సలెన్సీ అవార్డు లభించింది. ఇటీవల ఫిక్కీ నిర్వహించిన 20వ వార్షిక బీమా సదస్సు ’ఫిన్ కాస్ 2019’లో ఈ అవార్డును దక్కించుకున్నట్లు ఆక్సా లైఫ్ సంస్థ తెలిపింది. వినియోగదారుల స్నేహపూర్వక క్లెయిమ్స్ సేవలకు గాను ఫిక్కీ అవార్డుతో సత్కరించినట్లు పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఫిక్కీ క్లెయిమ్స్ ఎక్సలెన్సీ అవార్డు
ఎప్పుడు : మే 28
ఎవరు : భారతీ ఆక్సా లైఫ్ ఇన్సూరెన్స్
ఎందుకు : వినియోగదారుల స్నేహపూర్వక క్లెయిమ్స్ సేవలకు గాను
ఆండీ ముర్రేకు సర్ బిరుదు

క్విక్ రివ్యూ:
ఏమిటి : బ్రిటన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘సర్’ బిరుదు
ఎప్పుడు : మే 16
ఎవరు : ఆండీ ముర్రే
ఉత్తమ వర్సిటీగా వీఐటీకి యునికా పురస్కారం
భారత్లో ఉత్తమ విశ్వవిద్యాలయంగా వేలూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వీఐటీ)కి యునికా పురస్కారం లభించింది. ఈ మేరకు ఐరోపాలో ఉన్న విశ్వవిద్యాలయాల సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పడిన యునికా సంస్థ వీఐటీని ఎంపిక చేసింది. బెల్జియం రాజధాని బ్రషల్స్ కేంద్రంగా కొనసాగుతున్న యునికా అంతర్జాతీయ స్థాయి విశ్వవిద్యాలయాలతో కలిసి ప్రపంచ స్థాయిలో ఉన్నత విద్యను అందించడానికి సూచనలు చేస్తుంది. ఏటా ప్రపంచ స్థాయిలో నాణ్యమైన ఉన్నత విద్యను అందించే వర్సిటీని ఎంపికచేసి పురస్కారం అందజేస్తోంది. సంస్థ వార్షిక సమావేశం ఇటీవల దిల్లీలో జరిగింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఉత్తమ వర్సిటీగా వీఐటీకి యునికా పురస్కారం
ఎప్పుడు : మే 16
ఎక్కడ : భారత్
పిసిటి హ్యూమానిటికి గిన్నిస్ బుక్లో స్థానం
జోగిందర్ సింగ్ సలారియా అనే భారతీయుడు నిర్వహిస్తున్న పిసిటి హ్యూమానిటి అనే దాతృత్వ సంస్థకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం లభించింది. రంజాన్ మాసంలో దుబాయ్ ప్రజలకు ప్రతిరోజూ శాఖాహార ఇఫ్తార్ను అందిస్తున్నందుకు పిసిటికి గిన్నిస్లో చోటు దక్కింది. యూఏఈలో మే 18న ‘లాంగెస్ట్ లైన్ ఆఫ్ హంగర్ రిలీఫ్ ప్యాకేజ్’గా గిన్నిస్ బుక్లో నమోదైంది. ప్రజలకు స్వచ్ఛమైన శాఖాహారాన్ని అందించి వారిని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా, జంతువులను పరిరక్షించే లక్ష్యంతో ఇఫ్తార్ కార్యక్రమాన్ని చేపట్టామని సలారియా తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం
ఎప్పుడు : మే 18
ఎవరు : జోగిందర్ సింగ్ సలారియా (పిసిటి హ్యూమానిటి)
ఎక్కడ : దుబాయ్, యూఏఈ
ఎందుకు : ఇఫ్తార్ను అందిస్తున్నందుకు
కీడ్స్కు రాజీవ్గాంధీ సమాజ్ రత్న అవార్డు
వరంగల్ కేంద్రంగా పనిచేస్తున్న కాకతీయ ఎడ్యుకేషన్ ఎన్వైర్మెంట్ ఎకనమిక్ డెవలప్మెంట్ సొసైటీ(కీడ్స) స్వచ్ఛంద సంస్థకు రాజీవ్గాంధీ సమాజ్ రత్న అవార్డు లభించింది. రాజీవ్గాంధీ వర్ధంతి సందర్భంగా ఢిల్లీలో మే 21న జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును ఈ సంస్థకు అందజేశారు. సమాజ సేవకు పాటుపడుతున్న పలు సంస్థలు, వ్యక్తులకు రాజీవ్గాంధీ సమాజ్ రత్న అవార్డును అందజేస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రాజీవ్గాంధీ సమాజ్ రత్న అవార్డు
ఎప్పుడు : మే 21
ఎవరు : కాకతీయ ఎడ్యుకేషన్ ఎన్వైర్మెంట్ ఎకనమిక్ డెవలప్మెంట్ సొసైటీ(కీడ్స)
భారత పోలీసు అధికారికి ఐరాస పురస్కారం
శాంతి పరిరక్షణలో అసువులు బాసిన భారతదేశ పోలీసు అధికారి జితేందర్ కుమార్కు ఐక్యరాజ్యసమితి హామర్షల్డ్ పురస్కారాన్ని ప్రదానం చేయనుంది. అంతర్జాతీయ శాంతిస్థాపకుల దినోత్సవం సందర్భంగా మే 24న ఐరాసలో జరిగే కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందజేయనున్నారు. కాంగో దేశంలో సేవలు అందిస్తూ జితేందర్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది విధి నిర్వహణలో మరణించిన మొత్తం 119 మంది మిలటరీ, పోలీసు అధికారులకు ఐరాస హామర్షల్డ్ పురస్కారాన్ని అందజేయనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐక్యరాజ్యసమితి హామర్షల్డ్ పురస్కారాం
ఎప్పుడు : మే 21
ఎవరు : జితేందర్ కుమార్
గుంటూరు వైద్యుడికి అంతర్జాతీయ అవార్డు
గుంటూరుకు చెందిన వెన్నెముక శస్త్రచికిత్స నిపుణుడు, మల్లిక స్పైన్ సెంటర్ అధినేత డాక్టర్ జె. నరేష్బాబుకు అంతర్జాతీయ అవార్డు లభించింది. కెనడాలో మే 16న జరిగిన కార్యక్రమంలో నరేష్ సహా 11 మందికి డిస్కవరీ అండ్ ఇన్నొవేషన్ అవార్డును అందజేశారు. వెన్నెముక ఆపరేషన్ ఇన్ఫెక్షన్స్ పై చేసిన పరిశోధనలకు గాను నరేష్కు ఈ అవార్డు దక్కింది. స్విట్జర్లాండ్కు చెందిన ఏఓ స్పైన్ ఇంటర్నేషనల్ సంస్థ వెన్నెముకకు సంబంధించి జరిగే ఒరిజనల్ రీసెర్చికు ప్రోత్సాహం ఇచ్చేందుకు డిస్కవరీ అండ్ ఇన్నొవేషన్ అవార్డును అందిస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : డిస్కవరీ అండ్ ఇన్నొవేషన్ అవార్డు
ఎప్పుడు : మే 16
ఎవరు : డాక్టర్ జె. నరేష్బాబు
ఎక్కడ : కెనడా
అభినందన్ స్క్వాడ్రన్కు స్లేయర్స్ బ్యాడ్జీ

క్విక్ రివ్యూ:
ఏమిటి : ఫాల్కన్ స్లేయర్స్, అమ్రామ్ డాడ్చర్స్ బ్యాడ్జీలు జారీ
ఎప్పుడు : మే 15
ఎవరు : 51 స్క్వాడ్రన్ వైమానిక దళం
ఎందుకు : పాక్కి చెందిన ఎఫ్-16 విమానాలతో పాటు అమ్రామ్ క్షిపణులను తిప్పికొట్టినందుకు
రవిశంకర్కు సెయింట్ జార్జ్ అవార్డు

క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆర్డర్ ఆఫ్ సెయింట్ జార్జ్ అవార్డు
ఎప్పుడు : మే 2
ఎవరు : శ్రీశ్రీ రవిశంకర్
నగెన్ సైకియాకు ఎన్టీఆర్ పురస్కారం
ప్రముఖ అస్సామీ కథకుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు, అస్సామీ పత్రికల సంపాదకుడు నగెన్ సైకియాకు ఎన్టీఆర్ జాతీయ సాహితీ పురస్కారం-2019 లభించింది. ఈ మేరకు ఎన్టీఆర్ పురస్కారానికి నగెన్ను ఎంపికచేసినట్లు ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు డాక్టర్ నందమూరి లక్ష్మీ పార్వతి మే 2న వెల్లడించారు. ఎన్టీఆర్ జయంతి రోజైన 28న ఈ పురస్కారాన్ని ప్రధానం చేయనున్నట్లు పేర్కొన్నారు. 2006లో ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ను స్థాపించగా 2007 నుంచి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన 26 భాషల్లోని ప్రముఖులకు ఏటా పురస్కారాలు అందజేస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎన్టీఆర్ జాతీయ సాహితీ పురస్కారం-2019
ఎప్పుడు : మే 2
ఎవరు : నగెన్ సైకియా
ఎనిమిది టీటీడీ సంస్థలకు ఐఎస్ఓ గుర్తింపు
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎనిమిది సంస్థలకు మే 4న ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ (ఐఎస్ఓ) గుర్తింపు లభించింది. దీంతో ఐఎస్ఓ గుర్తింపు టీటీడీ సంస్థల సంఖ్య తొమ్మిదికి చేరింది. తిరుపతిలోని మాధవం వసతి సముదాయంతో పాటు ఎస్పీడబ్ల్యూ పాలిటెక్నిక్, శ్రీ పద్మావతి జూనియర్ కళాశాల, ఎస్వీ జూనియర్ కళాశాల, కుప్పం, రాజాం, నర్సాపూర్, మహబూబ్నగర్, బెంగళూరులోని టీటీడీ కల్యాణ మండపాలకు ఐఎస్ఓ గుర్తింపునిచ్చింది. అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించడం వల్లే వీటికి గుర్తింపు దక్కిందని టీటీడీ ఈవో అనిల్కుమార్ సింఘాల్ తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎనిమిది టీటీడీ సంస్థలకు ఐఎస్ఓ గుర్తింపు
ఎప్పుడు : మే 4
ఎవరు : ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ (ఐఎస్ఓ)
ఎందుకు : అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించినందుకు
తెలంగాణ వ్యవసాయశాఖకు సీఎస్ఐ అవార్డు
తెలంగాణ వ్యవసాయశాఖకు ప్రతిష్టాత్మక కంప్యూటర్ సైన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా (సీఎస్ఐ) నిహిలెంట్ ఇ-గవర్నెన్స్ అవార్డు లభించింది. 2017-18 సంవత్సరానికి స్పెషల్ ఇన్నోవేటివ్ గ్రూప్ కింద వ్యవసాయశాఖ విత్తన విభాగానికి ఈ అవార్డు దక్కింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు నాణ్యమైన, మేలు రకాల విత్తనాలను ఆన్లైన్లో రాయితీపై రెండేళ్లుగా అందజేస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సీఎస్ఐ నిహిలెంట్ ఇ-గవర్నెన్స్ అవార్డు
ఎప్పుడు : మే 4
ఎవరు : తెలంగాణ వ్యవసాయశాఖ
Published date : 17 May 2019 05:07PM