జూన్ 2020 అవార్డ్స్
Sakshi Education
వెయిట్ లిఫ్టర్ సంజితకు అర్జున అవార్డు
రెండేళ్ల తర్వాత ఎట్టకేలకు భారత వెయిట్ లిఫ్టర్ సంజిత చాను అవార్డు అవార్దు ఇవ్వనున్నారు. సంజిత డోపింగ్కు పాల్పడలేదని రుజువు కావడంతో 2018 ఏడాదిలో నిలుపుదల చేసిన అవార్డును ఇప్పుడు ఇవ్వనున్నారు. అంతర్జాతీయ వెయిట్ లిఫ్టింగ్ సమాఖ్య (ఐడబ్ల్యూఎఫ్) ఆమెను నిర్దోషిగా ప్రకటించడంతో 2018 ఏడాదికి గానూ ఆమెకు ప్రతిష్టాత్మక ‘అర్జున’ను అందజేయనున్నట్లు క్రీడా మంత్రిత్వ శాఖ జూన్ 25న ప్రకటించింది. 2014, 2018 కామన్వెల్త్ క్రీడలో సంజిత స్వర్ణ పతకాలు సాధించింది.
నిర్దోషిగా బయటపడినపుడు...
2018 మే నెలలో డోపింగ్ ఆరోపణలతో ఆమెపై సస్పెన్షన్ వేటు వేశారు. 2018, ఆగస్టులో సంజిత దాఖలు చేసిన ఫిటిషన్పై విచారించిన ఢిల్లీ హైకోర్టు... అవార్డు నామినీల కేటగిరీలో సంజిత దరఖాస్తును పరిశీలించాలని అవార్డుల కమిటీని కోరింది. తమ తుది నిర్ణయాన్ని సీల్డ్ కవర్లో భద్రపరచాలని సూచించిన హైకోర్టు ఆమె నిర్దోషిగా బయటపడినపుడు దాన్ని బయటపెట్టాలని పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత వెయిట్ లిఫ్టర్ సంజిత చానుకు అర్జున అవార్డు
ఎప్పుడు : జూన్ 25
ఎవరు : కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ
ఎందుకు : సంజిత డోపింగ్కు పాల్పడలేదని రుజువు కావడంతో
ఆంధ్రప్రదేశ్కు 11 డీడీయూపీఎస్పీ అవార్డులు
గ్రామీణ ప్రాంతంలోని ప్రజలకు సేవలు అందించడంలో మెరుగైన పనితీరును కనబరిచినందుగాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 11 దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయతీ సశక్తికరణ్ పురస్కార్ (డీడీయూపీఎస్పీ)-2020 అవార్డులు లభించాయి. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం... రాష్ట్రంలో ఒక జిల్లా పరిషత్, నాలుగు మండల పరిషత్లు, ఆరు గ్రామ పంచాయతీలు 2020 ఏడాది అవార్డులను దక్కించుకున్నాయి.
అవార్డులు వివరాలు ఇలా..
జిల్లా స్థాయిలో: పశ్చిమ గోదావరి
మండల స్థాయిలో: రామచంద్రాపురం, బంగారుపాళెం (చిత్తూరు జిల్లా), మేడికొండూరు (గుంటూరు జిల్లా), చెన్నూరు (వైఎస్సార్ జిల్లా)
గ్రామ పంచాయతీ స్థాయిలో: కొండకిందం (విజయనగరం జిల్లా), వేములకోట, కురిచేడు (ప్రకాశం జిల్లా), చెల్లూరు (తూర్పు గోదావరి జిల్లా), అంగలకుదురు, కొట్టెవరం (గుంటూరు జిల్లా).
పారిశుధ్యం, ప్రజా సేవలు (తాగునీరు, వీధి దీపాలు, మౌలికవసతులు), సహజ వనరుల నిర్వహణ, అట్టడుగు వర్గాలు (మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ, వయో వృద్ధులు), సామాజికరంగ పనితీరు, విపత్తు నిర్వహణ, గ్రామ పంచాయతీల అభివృద్ధికి వ్యక్తిగత సహాయం, ఆదాయ ఆర్జనలో కొత్తవిధానాలు, ఇ-గవర్నెన్స్ విభాగాల్లో ఆయా పంచాయతీరాజ్ సంస్థలు తీసుకునే ఉత్తమ చర్యలను పరిగణనలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం ఏటా ఈ అవార్డులను అందిస్తోంది.
డీడీఎస్కు పర్యావరణ అవార్డు
జహీరాబాద్: పర్యావరణాన్ని కాపాడుతూ సహజ పద్ధతిలో వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు గాను సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ (డీడీఎస్)కి ప్రిన్స్ అల్బర్ట్ మొనాకో అవార్డు లభించింది. జూన్ 11న రాత్రి దీనికి సంబంధించిన వివరాలను డీడీఎస్ డెరైక్టర్ పి.వి.సతీశ్ మీడియాకు వెల్లడించారు. పర్యావరణానికి సంబంధించి ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన ప్రిన్స్ అల్బర్ట్ అవార్డు ఈసారి డీడీఎస్కు దక్కిందన్నారు. వ్యవసాయరంగంలో జీవ వైవిధ్యంపై డీడీఎస్ మహిళలు 30 ఏళ్లుగా చేస్తున్న కృషిని గుర్తించి ఈ అవార్డును ప్రకటించారని వివరించారు. జూన్ 11న మొనాకో దేశంలో నిర్వహించిన అంతర్జాతీయ టెలి కాన్ఫరెన్స్ లో ప్రిన్స్ అల్బర్ట్ మెమోరియల్ ఫౌండేషన్, డీడీఎస్కు అవార్డును ప్రకటించిందని, చెప్పారు. భారతదేశానికి గత 13 సంవత్సరాల్లో ఈ అవార్డు రావడం రెండోసారి అని, మొదటి సారి ప్రఖ్యాత పర్యావరణ వేత్త డాక్టర్ సునీతా నారాయణ్ దీనిని అందుకున్నారని తెలిపారు. తర్వాత 2020 సంవత్సరానికి డీడీఎస్కే ఈ అవార్డు దక్కిందన్నారు.
క్విక్ రివ్వూ :
ఏమిటి : డీడీఎస్కు పర్యావరణ అవార్డు
ఎప్పుడు: జూన్ 11, 2020
ఎక్కడ : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ (డీడీఎస్)
ఎందుకు: పర్యావరణాన్ని కాపాడుతూ సహజ పద్ధతిలో వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు గాను
రత్తన్లాల్కు వరల్డ్ ఫుడ్ ప్రైజ్
న్యూయార్క్: ప్రముఖ భారత సంతతి అమెరికన్ శాస్త్రవేత్త రత్తన్లాల్(75)ను ప్రతిష్టాత్మక వరల్డ్ ఫుడ్ ప్రైజ్ వరించింది. 2020 సంవత్సరానికి సుమారు రూ.1.90 కోట్ల విలువైన ఈ బహుమతికి ఆయన్ను ఎంపిక చేసినట్లు వరల్డ్ ఫుడ్ ప్రైజ్ పేర్కొంది. ‘రత్తన్లాల్ 50 ఏళ్లుగా నాలుగు ఖండాల్లో భూసార పరిరక్షణకు, 50 కోట్ల మంది రైతుల జీవనోపాధి పెంపునకు కృషి చేశారు. 200 కోట్ల ప్రజలకు ఆహార భద్రత కల్పించారు. వేలాది హెక్టార్ల భూమిలో సహజ ఉష్ణమండల పర్యావరణ వ్యవస్థలను కాపాడారు’ అని వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఆర్గనైజేషన్ కొనియాడింది.
క్విక్ రివ్వూ :
ఏమిటి : ప్రముఖ భారత సంతతి అమెరికన్ శాస్త్రవేత్త రత్తన్లాల్కు ప్రతిష్టాత్మక వరల్డ్ ఫుడ్ ప్రైజ్
ఎవరు : అమెరికన్ శాస్త్రవేత్త రత్తన్లాల్
ఎందుకు: 50 ఏళ్లుగా నాలుగు ఖండాల్లో భూసార పరిరక్షణకు, 50 కోట్ల మంది రైతుల జీవనోపాధి పెంపునకు కృషి
ఆస్కార్ అవార్డుల వేడుక వాయిదా
అంతర్జాతీయ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం వాయిదా పడింది. 2021, ఫిబ్రవరి 28న జరగాల్సిన 93వ ఆస్కార్ వేడుకలను కరోనా వైరస్ కారణంగా రెండు నెలలు వాయిదా వేస్తున్నట్లు అవార్డుల కమిటీ ‘ద అకాడమీ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స అండ్ సెన్సైస్‘ జూన్ 16న ప్రకటించింది. 2021, ఏప్రిల్ 25న పురస్కారాల ప్రధానం ఉంటుందని వెల్లడించింది. ఆస్కార్ 2021 అవార్డుల కోసం నామినేషన్ తేదీని కూడా డిసెంబర్ 31 నుంచి ఫిబ్రవరి 28 వరకు పొడిగించాలని అకాడమీ నిర్ణయించింది. కరోనా కారణంగా విధించిన లాక్డౌన్ వల్ల చివరిదశలో ఉన్న ఎన్నో సినిమాల షూటింగ్లు ఆగిపోగా, మరెన్నో చిత్రాలు విడుదలకు నోచుకోలేదు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2021 ఆస్కార్ అవార్డుల వేడుక వాయిదా
ఎప్పుడు : జూన్ 16
ఎవరు : ద అకాడమీ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స అండ్ సెన్సైస్
ఎందుకు : కరోనా వైరస్ కారణంగా
కిరణ్ మజుందార్ షాకు అంతర్జాతీయ అవార్డు
బయోకాన్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షాని ప్రతిష్ఠాత్మక అవార్డు వరించింది. జీవఔషధాల సంస్థను స్థాపించి.. గడిచిన 30 ఏళ్ల నుంచి సమర్థవంతంగా, వృద్ధి బాటలో ఈ సంస్థను నడిపిస్తున్నందుకు గానూ ‘ఈవై వరల్డ్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు 2020’ పురస్కారం దక్కింది. దాతృత్వం పట్ల ఆమెకు ఉన్న అభిరుచి, ప్రపంచ ప్రఖ్యాత సంస్థగా తీర్చిదిద్దడంలో కనబర్చిన చిత్తశుద్ధి వంటి అంశాల ఆధారంగా అవార్డును ప్రకటిస్తున్నట్లు జడ్జింగ్ ప్యానెల్ ప్రకటించింది. వర్చువల్ ఎంటర్ ప్రెన్యూర్షిప్ అవార్డు కార్యక్రమంలో జూన్ 4న ఆమెను ఈ అవార్డుతో సత్కరించింది. మొత్తం 41 దేశాల నుంచి 46 మంది పారిశ్రామికవేత్తలు ఈ అవార్డుకు పోటీ పడ్డారు. గతంలో కొటక్ మహీంద్రా బ్యాంక్ సీఈఓ ఉదయ్ కొటక్, ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ నారాయణ మూర్తి భారత్ నుంచి ఈ అవార్డును అందుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఈవై వరల్డ్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు 2020 విజేత
ఎప్పుడు : జూన్ 4
ఎవరు : కిరణ్ మజుందార్ షా
ఎందుకు : జీవఔషధాల సంస్థను స్థాపించి.. గడిచిన 30 ఏళ్ల నుంచి సమర్థవంతంగా, వృద్ధి బాటలో ఈ సంస్థను నడిపిస్తున్నందుకు
మైకేల్ క్లార్క్కు ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా పురస్కారం
ఆసీస్ ప్రపంచకప్ విజయ సారథి మైకేల్ క్లార్క్ ‘ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా’ పురస్కారానికి ఎంపికయ్యాడు. క్రికెట్కు అందించిన విశేష సేవలకుగాను క్లార్క్కు ఈ పురస్కారం దక్కింది. 39 ఏళ్ల క్లార్క్ తన కెరీర్లో 115 టెస్టులాడి 8643 పరుగులు చేశాడు. 245 వన్డేల్లో 7981 పరుగులు, 34 టి20ల్లో 488 పరుగులు చేశాడు. 2015 వన్డే ప్రపంచకప్లో ఆసీస్ను విజేతగా నిలిపాడు. ఆసీస్లో ‘ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా’ అనేది ఆ దేశ మూడో అత్యున్నత పురస్కారం. గతంలో దిగ్గజ క్రికెటర్లయిన అలెన్ బోర్డర్, బాబ్ సింప్సన్, స్టీవ్ వా, మార్క్ టేలర్, రికీ పాంటింగ్లకు ఈ అవార్డు లభించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా పురస్కారానికి ఎంపిక
ఎప్పుడు : జూన్ 8
ఎవరు : మెకేల్ క్లార్క్
ఎందుకు : క్రికెట్కు అందించిన విశేష సేవలకుగాను
రామన్ మెగసెసె పురస్కారాలు రద్దు
ఆసియన్ నోబెల్ ప్రైజ్గా పేరు పొందిన మెగసెసె పురస్కారాలు రద్దయ్యాయి. ఫిలిప్పీన్స్ లో కరోనా ఉద్ధృతి కారణంగా 2020 మెగసెసె అవార్డులను రద్దు చేస్తున్నట్లు ది రామన్ మెగసెసె అవార్డ్ ఫౌండేషన్ జూన్ 9న ప్రకటించింది. ఆరు దశాబ్దాల్లో ఈ పురస్కారాలు రద్దు కావడం ఇది మూడోసారి. 1970లో ఆర్థిక సంక్షోభం, 1990లో భూకంపం కారణంగా ఈ అవార్డులను ప్రదానం చేయలేదు.
1957 ఏప్రిల్లో...
మెగసెసె అవార్డును ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు రామన్ మెగసెసె పేరున ఏర్పాటు చేశారు. ’ఆసియన్ నోబెల్ ప్రైజ్’గా పేరు పొందిన మెగసెసె అవార్డును 1957 ఏప్రిల్లో రాక్ఫెల్లర్ బ్రదర్స్ ఫండ్ (న్యూయార్క్), ఫిలిప్పీన్స్ ప్రభుత్వం సంయుక్తంగా నెలకొల్పాయి. ఈ అవార్డుకు ఏటా వివిధ రంగాలలో విశేష ప్రతిభ/కృషి కనపరచిన ఆసియాకు చెందిన వ్యక్తులను, సంస్థలను ఎంపిక చేస్తారు.
మొత్తం ఆరు విభాగాల్లో...
మొత్తం ఆరు విభాగాల్లో ఈ అవార్డులు ప్రకటిస్తారు. అవి 1. గవర్నమెంట్ సర్వీసు 2. పబ్లిక్ సర్వీసు 3. కమ్యూనిటీ లీడర్షిప్ 4. జర్నలిజం, లిటరేచర్, క్రియేటివ్ కమ్యూనికేషన్ ఆర్ట్స 5. పీస్ అండ్ ఇంటర్నేషనల్ అండర్స్టాడింగ్ 6. ఎమర్జంట్ లీడర్షిప్. ’ఎమర్జంట్ లీడర్షిప్’ అవార్డును మాత్రం ఫోర్డ్ ఫౌండేషన్ ఆర్థిక సహకారంతో 2001 నుంచి అందజేస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రామన్ మెగసెసె పురస్కారాలు రద్దు
ఎప్పుడు : జూన్ 9
ఎవరు : ది రామన్ మెగసెసె అవార్డ్ ఫౌండేషన్
ఎందుకు : ఫిలిప్పీన్స్ లో కరోనా ఉద్ధృతి కారణంగా
ఎన్ఐఎన్ శాస్త్రవేత్తకు సొసైటీ ఆఫ్ న్యూట్రిషన్ అవార్డు
పౌష్టికాహార రంగంలో జరిపిన విశేష కృషికి గాను, హైదరాబాద్లోని జాతీయ పోషకాహార సంస్థ(ఎన్ఐఎన్) సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జి.సుబ్బారావు ప్రతిష్టాత్మక అమెరికన్ సొసైటీ ఆఫ్ న్యూట్రిషన్ అవార్డుకు ఎంపికయ్యారు. న్యూట్రిషన్ ఎడ్యుకేషన్ అండ్ బిహేవియర్ సెన్సైస్ విభాగంలో 2020 సంవత్సరానికిగాను ఈ అవార్డును అందజేయనున్నారు. ఈ విషయాన్ని ‘న్యూట్రిషన్ లైవ్ -2020’ పేరుతో జూన్ 2న జరిగిన ఆన్లైన్ సదస్సులో వెల్లడించారు.
జాతీయ పోషకాహార సంస్థలో సైంటిస్ట్గా పనిచేస్తున్న సుబ్బారావు ఇప్పటివరకు సుమారు 63 పరిశోధన వ్యాసాలను ప్రచురించారు. రాయల్ సొసైటీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (యూకే) సభ్యుడైన సుబ్బారావుకు ఈ అవార్డు దక్కడంపై జాతీయ పోషకాహార సంస్థ డెరైక్టర్ డాక్టర్ ఆర్.హేమలత హర్షం వ్యక్తం చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రతిష్టాత్మక అమెరికన్ సొసైటీ ఆఫ్ న్యూట్రిషన్ అవార్డుకు ఎంపిక
ఎప్పుడు : జూన్ 2
ఎవరు : ఎన్ఐఎన్ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జి.సుబ్బారావు
ఎందుకు : పౌష్టికాహార రంగంలో జరిపిన విశేష కృషికి గాను
రెండేళ్ల తర్వాత ఎట్టకేలకు భారత వెయిట్ లిఫ్టర్ సంజిత చాను అవార్డు అవార్దు ఇవ్వనున్నారు. సంజిత డోపింగ్కు పాల్పడలేదని రుజువు కావడంతో 2018 ఏడాదిలో నిలుపుదల చేసిన అవార్డును ఇప్పుడు ఇవ్వనున్నారు. అంతర్జాతీయ వెయిట్ లిఫ్టింగ్ సమాఖ్య (ఐడబ్ల్యూఎఫ్) ఆమెను నిర్దోషిగా ప్రకటించడంతో 2018 ఏడాదికి గానూ ఆమెకు ప్రతిష్టాత్మక ‘అర్జున’ను అందజేయనున్నట్లు క్రీడా మంత్రిత్వ శాఖ జూన్ 25న ప్రకటించింది. 2014, 2018 కామన్వెల్త్ క్రీడలో సంజిత స్వర్ణ పతకాలు సాధించింది.
నిర్దోషిగా బయటపడినపుడు...
2018 మే నెలలో డోపింగ్ ఆరోపణలతో ఆమెపై సస్పెన్షన్ వేటు వేశారు. 2018, ఆగస్టులో సంజిత దాఖలు చేసిన ఫిటిషన్పై విచారించిన ఢిల్లీ హైకోర్టు... అవార్డు నామినీల కేటగిరీలో సంజిత దరఖాస్తును పరిశీలించాలని అవార్డుల కమిటీని కోరింది. తమ తుది నిర్ణయాన్ని సీల్డ్ కవర్లో భద్రపరచాలని సూచించిన హైకోర్టు ఆమె నిర్దోషిగా బయటపడినపుడు దాన్ని బయటపెట్టాలని పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత వెయిట్ లిఫ్టర్ సంజిత చానుకు అర్జున అవార్డు
ఎప్పుడు : జూన్ 25
ఎవరు : కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ
ఎందుకు : సంజిత డోపింగ్కు పాల్పడలేదని రుజువు కావడంతో
ఆంధ్రప్రదేశ్కు 11 డీడీయూపీఎస్పీ అవార్డులు
గ్రామీణ ప్రాంతంలోని ప్రజలకు సేవలు అందించడంలో మెరుగైన పనితీరును కనబరిచినందుగాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 11 దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయతీ సశక్తికరణ్ పురస్కార్ (డీడీయూపీఎస్పీ)-2020 అవార్డులు లభించాయి. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం... రాష్ట్రంలో ఒక జిల్లా పరిషత్, నాలుగు మండల పరిషత్లు, ఆరు గ్రామ పంచాయతీలు 2020 ఏడాది అవార్డులను దక్కించుకున్నాయి.
అవార్డులు వివరాలు ఇలా..
జిల్లా స్థాయిలో: పశ్చిమ గోదావరి
మండల స్థాయిలో: రామచంద్రాపురం, బంగారుపాళెం (చిత్తూరు జిల్లా), మేడికొండూరు (గుంటూరు జిల్లా), చెన్నూరు (వైఎస్సార్ జిల్లా)
గ్రామ పంచాయతీ స్థాయిలో: కొండకిందం (విజయనగరం జిల్లా), వేములకోట, కురిచేడు (ప్రకాశం జిల్లా), చెల్లూరు (తూర్పు గోదావరి జిల్లా), అంగలకుదురు, కొట్టెవరం (గుంటూరు జిల్లా).
పారిశుధ్యం, ప్రజా సేవలు (తాగునీరు, వీధి దీపాలు, మౌలికవసతులు), సహజ వనరుల నిర్వహణ, అట్టడుగు వర్గాలు (మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ, వయో వృద్ధులు), సామాజికరంగ పనితీరు, విపత్తు నిర్వహణ, గ్రామ పంచాయతీల అభివృద్ధికి వ్యక్తిగత సహాయం, ఆదాయ ఆర్జనలో కొత్తవిధానాలు, ఇ-గవర్నెన్స్ విభాగాల్లో ఆయా పంచాయతీరాజ్ సంస్థలు తీసుకునే ఉత్తమ చర్యలను పరిగణనలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం ఏటా ఈ అవార్డులను అందిస్తోంది.
డీడీఎస్కు పర్యావరణ అవార్డు
జహీరాబాద్: పర్యావరణాన్ని కాపాడుతూ సహజ పద్ధతిలో వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు గాను సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ (డీడీఎస్)కి ప్రిన్స్ అల్బర్ట్ మొనాకో అవార్డు లభించింది. జూన్ 11న రాత్రి దీనికి సంబంధించిన వివరాలను డీడీఎస్ డెరైక్టర్ పి.వి.సతీశ్ మీడియాకు వెల్లడించారు. పర్యావరణానికి సంబంధించి ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన ప్రిన్స్ అల్బర్ట్ అవార్డు ఈసారి డీడీఎస్కు దక్కిందన్నారు. వ్యవసాయరంగంలో జీవ వైవిధ్యంపై డీడీఎస్ మహిళలు 30 ఏళ్లుగా చేస్తున్న కృషిని గుర్తించి ఈ అవార్డును ప్రకటించారని వివరించారు. జూన్ 11న మొనాకో దేశంలో నిర్వహించిన అంతర్జాతీయ టెలి కాన్ఫరెన్స్ లో ప్రిన్స్ అల్బర్ట్ మెమోరియల్ ఫౌండేషన్, డీడీఎస్కు అవార్డును ప్రకటించిందని, చెప్పారు. భారతదేశానికి గత 13 సంవత్సరాల్లో ఈ అవార్డు రావడం రెండోసారి అని, మొదటి సారి ప్రఖ్యాత పర్యావరణ వేత్త డాక్టర్ సునీతా నారాయణ్ దీనిని అందుకున్నారని తెలిపారు. తర్వాత 2020 సంవత్సరానికి డీడీఎస్కే ఈ అవార్డు దక్కిందన్నారు.
క్విక్ రివ్వూ :
ఏమిటి : డీడీఎస్కు పర్యావరణ అవార్డు
ఎప్పుడు: జూన్ 11, 2020
ఎక్కడ : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ (డీడీఎస్)
ఎందుకు: పర్యావరణాన్ని కాపాడుతూ సహజ పద్ధతిలో వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు గాను
రత్తన్లాల్కు వరల్డ్ ఫుడ్ ప్రైజ్
న్యూయార్క్: ప్రముఖ భారత సంతతి అమెరికన్ శాస్త్రవేత్త రత్తన్లాల్(75)ను ప్రతిష్టాత్మక వరల్డ్ ఫుడ్ ప్రైజ్ వరించింది. 2020 సంవత్సరానికి సుమారు రూ.1.90 కోట్ల విలువైన ఈ బహుమతికి ఆయన్ను ఎంపిక చేసినట్లు వరల్డ్ ఫుడ్ ప్రైజ్ పేర్కొంది. ‘రత్తన్లాల్ 50 ఏళ్లుగా నాలుగు ఖండాల్లో భూసార పరిరక్షణకు, 50 కోట్ల మంది రైతుల జీవనోపాధి పెంపునకు కృషి చేశారు. 200 కోట్ల ప్రజలకు ఆహార భద్రత కల్పించారు. వేలాది హెక్టార్ల భూమిలో సహజ ఉష్ణమండల పర్యావరణ వ్యవస్థలను కాపాడారు’ అని వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఆర్గనైజేషన్ కొనియాడింది.
క్విక్ రివ్వూ :
ఏమిటి : ప్రముఖ భారత సంతతి అమెరికన్ శాస్త్రవేత్త రత్తన్లాల్కు ప్రతిష్టాత్మక వరల్డ్ ఫుడ్ ప్రైజ్
ఎవరు : అమెరికన్ శాస్త్రవేత్త రత్తన్లాల్
ఎందుకు: 50 ఏళ్లుగా నాలుగు ఖండాల్లో భూసార పరిరక్షణకు, 50 కోట్ల మంది రైతుల జీవనోపాధి పెంపునకు కృషి
ఆస్కార్ అవార్డుల వేడుక వాయిదా
అంతర్జాతీయ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం వాయిదా పడింది. 2021, ఫిబ్రవరి 28న జరగాల్సిన 93వ ఆస్కార్ వేడుకలను కరోనా వైరస్ కారణంగా రెండు నెలలు వాయిదా వేస్తున్నట్లు అవార్డుల కమిటీ ‘ద అకాడమీ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స అండ్ సెన్సైస్‘ జూన్ 16న ప్రకటించింది. 2021, ఏప్రిల్ 25న పురస్కారాల ప్రధానం ఉంటుందని వెల్లడించింది. ఆస్కార్ 2021 అవార్డుల కోసం నామినేషన్ తేదీని కూడా డిసెంబర్ 31 నుంచి ఫిబ్రవరి 28 వరకు పొడిగించాలని అకాడమీ నిర్ణయించింది. కరోనా కారణంగా విధించిన లాక్డౌన్ వల్ల చివరిదశలో ఉన్న ఎన్నో సినిమాల షూటింగ్లు ఆగిపోగా, మరెన్నో చిత్రాలు విడుదలకు నోచుకోలేదు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2021 ఆస్కార్ అవార్డుల వేడుక వాయిదా
ఎప్పుడు : జూన్ 16
ఎవరు : ద అకాడమీ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స అండ్ సెన్సైస్
ఎందుకు : కరోనా వైరస్ కారణంగా
కిరణ్ మజుందార్ షాకు అంతర్జాతీయ అవార్డు
బయోకాన్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షాని ప్రతిష్ఠాత్మక అవార్డు వరించింది. జీవఔషధాల సంస్థను స్థాపించి.. గడిచిన 30 ఏళ్ల నుంచి సమర్థవంతంగా, వృద్ధి బాటలో ఈ సంస్థను నడిపిస్తున్నందుకు గానూ ‘ఈవై వరల్డ్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు 2020’ పురస్కారం దక్కింది. దాతృత్వం పట్ల ఆమెకు ఉన్న అభిరుచి, ప్రపంచ ప్రఖ్యాత సంస్థగా తీర్చిదిద్దడంలో కనబర్చిన చిత్తశుద్ధి వంటి అంశాల ఆధారంగా అవార్డును ప్రకటిస్తున్నట్లు జడ్జింగ్ ప్యానెల్ ప్రకటించింది. వర్చువల్ ఎంటర్ ప్రెన్యూర్షిప్ అవార్డు కార్యక్రమంలో జూన్ 4న ఆమెను ఈ అవార్డుతో సత్కరించింది. మొత్తం 41 దేశాల నుంచి 46 మంది పారిశ్రామికవేత్తలు ఈ అవార్డుకు పోటీ పడ్డారు. గతంలో కొటక్ మహీంద్రా బ్యాంక్ సీఈఓ ఉదయ్ కొటక్, ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ నారాయణ మూర్తి భారత్ నుంచి ఈ అవార్డును అందుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఈవై వరల్డ్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు 2020 విజేత
ఎప్పుడు : జూన్ 4
ఎవరు : కిరణ్ మజుందార్ షా
ఎందుకు : జీవఔషధాల సంస్థను స్థాపించి.. గడిచిన 30 ఏళ్ల నుంచి సమర్థవంతంగా, వృద్ధి బాటలో ఈ సంస్థను నడిపిస్తున్నందుకు
మైకేల్ క్లార్క్కు ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా పురస్కారం
ఆసీస్ ప్రపంచకప్ విజయ సారథి మైకేల్ క్లార్క్ ‘ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా’ పురస్కారానికి ఎంపికయ్యాడు. క్రికెట్కు అందించిన విశేష సేవలకుగాను క్లార్క్కు ఈ పురస్కారం దక్కింది. 39 ఏళ్ల క్లార్క్ తన కెరీర్లో 115 టెస్టులాడి 8643 పరుగులు చేశాడు. 245 వన్డేల్లో 7981 పరుగులు, 34 టి20ల్లో 488 పరుగులు చేశాడు. 2015 వన్డే ప్రపంచకప్లో ఆసీస్ను విజేతగా నిలిపాడు. ఆసీస్లో ‘ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా’ అనేది ఆ దేశ మూడో అత్యున్నత పురస్కారం. గతంలో దిగ్గజ క్రికెటర్లయిన అలెన్ బోర్డర్, బాబ్ సింప్సన్, స్టీవ్ వా, మార్క్ టేలర్, రికీ పాంటింగ్లకు ఈ అవార్డు లభించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా పురస్కారానికి ఎంపిక
ఎప్పుడు : జూన్ 8
ఎవరు : మెకేల్ క్లార్క్
ఎందుకు : క్రికెట్కు అందించిన విశేష సేవలకుగాను
రామన్ మెగసెసె పురస్కారాలు రద్దు
ఆసియన్ నోబెల్ ప్రైజ్గా పేరు పొందిన మెగసెసె పురస్కారాలు రద్దయ్యాయి. ఫిలిప్పీన్స్ లో కరోనా ఉద్ధృతి కారణంగా 2020 మెగసెసె అవార్డులను రద్దు చేస్తున్నట్లు ది రామన్ మెగసెసె అవార్డ్ ఫౌండేషన్ జూన్ 9న ప్రకటించింది. ఆరు దశాబ్దాల్లో ఈ పురస్కారాలు రద్దు కావడం ఇది మూడోసారి. 1970లో ఆర్థిక సంక్షోభం, 1990లో భూకంపం కారణంగా ఈ అవార్డులను ప్రదానం చేయలేదు.
1957 ఏప్రిల్లో...
మెగసెసె అవార్డును ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు రామన్ మెగసెసె పేరున ఏర్పాటు చేశారు. ’ఆసియన్ నోబెల్ ప్రైజ్’గా పేరు పొందిన మెగసెసె అవార్డును 1957 ఏప్రిల్లో రాక్ఫెల్లర్ బ్రదర్స్ ఫండ్ (న్యూయార్క్), ఫిలిప్పీన్స్ ప్రభుత్వం సంయుక్తంగా నెలకొల్పాయి. ఈ అవార్డుకు ఏటా వివిధ రంగాలలో విశేష ప్రతిభ/కృషి కనపరచిన ఆసియాకు చెందిన వ్యక్తులను, సంస్థలను ఎంపిక చేస్తారు.
మొత్తం ఆరు విభాగాల్లో...
మొత్తం ఆరు విభాగాల్లో ఈ అవార్డులు ప్రకటిస్తారు. అవి 1. గవర్నమెంట్ సర్వీసు 2. పబ్లిక్ సర్వీసు 3. కమ్యూనిటీ లీడర్షిప్ 4. జర్నలిజం, లిటరేచర్, క్రియేటివ్ కమ్యూనికేషన్ ఆర్ట్స 5. పీస్ అండ్ ఇంటర్నేషనల్ అండర్స్టాడింగ్ 6. ఎమర్జంట్ లీడర్షిప్. ’ఎమర్జంట్ లీడర్షిప్’ అవార్డును మాత్రం ఫోర్డ్ ఫౌండేషన్ ఆర్థిక సహకారంతో 2001 నుంచి అందజేస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రామన్ మెగసెసె పురస్కారాలు రద్దు
ఎప్పుడు : జూన్ 9
ఎవరు : ది రామన్ మెగసెసె అవార్డ్ ఫౌండేషన్
ఎందుకు : ఫిలిప్పీన్స్ లో కరోనా ఉద్ధృతి కారణంగా
ఎన్ఐఎన్ శాస్త్రవేత్తకు సొసైటీ ఆఫ్ న్యూట్రిషన్ అవార్డు
పౌష్టికాహార రంగంలో జరిపిన విశేష కృషికి గాను, హైదరాబాద్లోని జాతీయ పోషకాహార సంస్థ(ఎన్ఐఎన్) సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జి.సుబ్బారావు ప్రతిష్టాత్మక అమెరికన్ సొసైటీ ఆఫ్ న్యూట్రిషన్ అవార్డుకు ఎంపికయ్యారు. న్యూట్రిషన్ ఎడ్యుకేషన్ అండ్ బిహేవియర్ సెన్సైస్ విభాగంలో 2020 సంవత్సరానికిగాను ఈ అవార్డును అందజేయనున్నారు. ఈ విషయాన్ని ‘న్యూట్రిషన్ లైవ్ -2020’ పేరుతో జూన్ 2న జరిగిన ఆన్లైన్ సదస్సులో వెల్లడించారు.
జాతీయ పోషకాహార సంస్థలో సైంటిస్ట్గా పనిచేస్తున్న సుబ్బారావు ఇప్పటివరకు సుమారు 63 పరిశోధన వ్యాసాలను ప్రచురించారు. రాయల్ సొసైటీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (యూకే) సభ్యుడైన సుబ్బారావుకు ఈ అవార్డు దక్కడంపై జాతీయ పోషకాహార సంస్థ డెరైక్టర్ డాక్టర్ ఆర్.హేమలత హర్షం వ్యక్తం చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రతిష్టాత్మక అమెరికన్ సొసైటీ ఆఫ్ న్యూట్రిషన్ అవార్డుకు ఎంపిక
ఎప్పుడు : జూన్ 2
ఎవరు : ఎన్ఐఎన్ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జి.సుబ్బారావు
ఎందుకు : పౌష్టికాహార రంగంలో జరిపిన విశేష కృషికి గాను
Published date : 26 Jun 2020 01:33PM