Geethanjali Sree: హిందీ నవలకు బుకర్ ప్రైజ్
Sakshi Education
గీతాంజలిశ్రీ ‘రేత్ సమాధి’కి అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ పురస్కారం
- లండన్: హిందీ సాహిత్యానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. భారతీయ రచయిత్రి గీతాంజలిశ్రీకి ప్రతిష్టాత్మకమైన బుకర్ ప్రైజ్ లభించింది. ఆమె రాసిన హిందీ నవల ‘రేత్ సమాధి’ (ఇసుక సమాధి) ఆంగ్ల అనువాదం ‘టూంబ్ ఆఫ్ శాండ్’కు ఈ పురస్కారం లభించింది.
- Download Current Affairs PDFs Here
- లండన్లో గురువారం రాత్రి జరిగిన కార్యక్రమంలో గీతాంజలి బుకర్ ప్రైజ్ అందుకున్నారు. హిందీ మూల రచనకు బుకర్కు ప్రైజ్ రావడం ఇదే తొలిసారి. అవార్డు రావడం పట్ల సంభ్రమాశ్చర్యాలకు లోనైనట్టు 64 ఏళ్ల గీతాంజలి చెప్పారు.
Daily Current Affairs in Telugu: 2022, మే 27 కరెంట్ అఫైర్స్ - ‘‘బుకర్ పురస్కారం వస్తుందని ఊహించలేదు. ఇది అనితరసాధ్యమైన గుర్తింపు. నాకు ఎనలేని గౌరవం. చాలా ఆనందంగా ఉంది’’ అని తన ప్రసంగంలో చెప్పారు. ఘనమైన హిందీ సాహితీ సంపదకు ఈ పుస్తకం నిలువెత్తు నిదర్శమన్నారు. 50 వేల పౌండ్ల (దాదాపుగా రూ.49 లక్షలు) నగదు పురస్కారాన్ని నవలను ఆంగ్లంలోకి అనువదించిన రైజీ రాక్వెల్తో కలిసి ఆమె పంచుకుంటారు.
Published date : 28 May 2022 03:16PM