Skip to main content

టీఎస్ పాలిసెట్ దరఖాస్తు గడువు జూన్ 9 వరకు పెంపు

సాక్షి, హైదరాబాద్: పాలిసెట్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు గడువు వచ్చేనెల జూన్ 9 వరకు, ఆలస్య రుసుముతో 12 వరకు పొడిగించినట్లు ప్రొఫెసర్ జయశంకర్ రాష్ట్ర వ్యవసాయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ యస్.సుధీర్‌కుమార్ తెలిపారు.
వివిధ డిప్లొమా కోర్సుల్లో 2020-21 విద్యా ఏడాది అడ్మిషన్లు పాలిసెట్-2020 ప్రవేశ పరీక్ష ర్యాంకుల ఆధారంగా మాత్రమే జరుపుతామన్నారు.

టీఎస్ పాలిసెట్ 2020 ప్రీవియస్ పేపర్స్, స్టడీ మెటీరియల్, గెడైన్స్... ఇతర అప్‌డేట్స్ కొరకు క్లిక్ చేయండి.

వివిధ వ్యవసాయ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం కోసం పాలిసెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలు వెల్లడించిన తర్వాత, వర్సిటీ అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల చేస్తుందని చెప్పారు. వర్సిటీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి అభ్యర్థులు నాలుగేళ్లు గ్రామీణ ప్రాంతంలో చదివి ఉండాలన్నారు. ఇతర అన్ని వివరాలకు www.polycetts.nic.in, www.sbtet.telangana.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.
Published date : 30 May 2020 02:16PM

Photo Stories