కాంట్రాక్ట్ లెక్చరర్లను రెన్యువల్ చేస్తూ ఉత్తర్వులు జారీ
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లు, మినిమమ్ టైమ్ స్కేల్, పార్ట్ టైం లెక్చరర్లు, ల్యాబ్ అటెండర్స్ను రెన్యువల్ చేస్తూ ఆర్థిక శాఖ ఆగస్టు 28న ఉత్తర్వులు జారీ చేసింది.

గత 3 నెలలుగా రెన్యువల్ కోసం ఆందోళన చెందుతున్న లెక్చరర్ల కుటుంబాలకు ఈ ఉత్తర్వులతో ఎంతో ఉపశమనం లభిస్తుందని ఆర్జేడీ కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు గాదె వెంకన్న ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
Published date : 29 Aug 2020 03:30PM