జూలై 30 నుంచి ఎస్ఆర్ఎం జేఈఈఈ
Sakshi Education
అమరావతి: ఎస్ఆర్ఎం వర్సిటీలో 2020 బీటెక్ ప్రవేశాలకు నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ పరీక్షలను జూలై 30 నుంచి ఆగస్టు 4 వరకు నిర్వహించనున్నట్లు యాజమాన్యం ప్రకటించింది.

దేశవ్యాప్తంగా 127 కేంద్రాలతో పాటుగా దుబాయ్, దోహా, మస్కట్, బహ్రెయిన్, కువైట్ల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ ర్యాంకుల ఆధారంగా ఎస్ఆర్ఎం ప్రాంగణాల్లో ప్రవేశాలుంటాయని, ఆగస్టు 2 లేదా 3వ వారం నుంచి కౌన్సిలింగ్ చేపడతామని వెల్లడించింది. మరిన్ని వివరాలు www.srmist.edu.in వెబ్సైట్లో పొందుపరిచినట్లు పేర్కొంది.
Published date : 14 May 2020 03:07PM