ఎల్పీటీ పరీక్ష ఫలితాలు విడుదల
Sakshi Education
సాక్షి, అమరావతి: 2018-19 బ్యాచ్ లాంగ్వేజ్ పండిట్ ట్రైనింగ్ విద్యార్థులకు, అంతకు ముందు ఫెయిలైన వారికి జనవరిలో నిర్వహించిన పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరీక్షల విభాగం డెరైక్టర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

మొత్తం 95.31 శాతం మంది ఉత్తీర్ణులైనట్లు తెలిపారు. తమ కార్యాలయ వెబ్సైట్లో ఫలితాలను పొందుపరిచినట్లు చెప్పారు. రీ కౌంటింగ్ కోసం జూన్ 15లోగా ఏపీసీఎఫ్ఎంఎస్లో రూ.500 చలానా చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి.
Published date : 16 May 2020 03:54PM