Skip to main content

అక్టోబర్ 13 నుంచి ఆసెట్, ఆఈట్ - 2020 పరీక్షలు

ఏయూ క్యాంపస్ (విశాఖ తూర్పు): ఆంధ్రా విశ్వవిద్యాలయంలో పీజీ, సమీకృత ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఆసెట్, ఆఈట్(ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్) పరీక్షలు అక్టోబరు 13 నుంచి నిర్వహించనున్నట్లు ప్రవేశాల సంచాలకుడు ఆచార్య డి.ఎ.నాయుడు ఓ ప్రకటనలో తెలిపారు.
13న లైఫ్ సైన్స్, స్టాటిస్టిక్స్, బీఎఫ్‌ఏ, జియాలజీ, ఇంగ్లిష్, ఎకనామిక్స్ కోర్సులకు, 14న కెమికల్ సైన్స్, తెలుగు, ఫిజికల్ సైన్స్, ఎంకామ్ కోర్సులకు, 15న హ్యూమనిటీస్-సోషల్ సైన్స్, సమీకృత ఇంజనీరింగ్, మ్యాథమెటికల్ సెన్సైస్, ఎం.హెచ్.ఆర్.ఎం కోర్సులకు రాత పరీక్షలు నిర్వహిస్తామన్నారు. అభ్యర్థులు ఠీఠీఠీ.్చఠఛీౌ్చ.జీ వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లను అక్టోబర్ 5 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.
Published date : 30 Sep 2020 12:51PM

Photo Stories