Allam Narayana: హైదరాబాద్ జర్నలిస్టులకు శిక్షణా తరగతులు
Sakshi Education
గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్టులకు జూన్ 18, 19 తేదీల్లో శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు.
మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ
అదే విధంగా జూన్ 25, 26 తేదీల్లో ఉర్దూ Journalistలకు శిక్షణ తరగతులు ఉంటాయని వెల్లడించారు. జూన్ 15న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పలు అంశాల్లో నిపుణులతో నిర్వహించే ఈ శిక్షణ తరగతుల్లో మంత్రులు, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, ఎమ్మెల్యేలు కూడా పాల్గొంటారని తెలిపారు.