Skip to main content

Software Employee to Civils Ranker : 32ల‌క్ష‌ల ఉద్యోగం వ‌దులుకుని నేడు సివిల్స్‌లో 231వ ర్యాంకు.. ఇదే లక్ష్యంగా..

Software employee with 32lakh annum turns to civils 231st ranker

చింతకాని: యూపీఎస్‌సీ మంగళవారం విడుదల చేసిన ఫలితాల్లో జిల్లా నుంచి ఇద్దరు యువకులు ర్యాంకులు సాధించారు. చింతకాని మండలం మత్కేపల్లికి చెందిన నర్శింశెట్టి చరణ్‌ తేజ 231వ ర్యాంక్‌ సాధించడం విశేషం. అదే గ్రామానికి చెందిన నర్శింశెట్టి హరినాథ్‌బాబు – నాగమణి దంపతుల చిన్న కుమారుడు ఈ చరణ్‌ తేజ.. 10వ తరగతి వరకు హైదరాబాద్‌లోని నారాయణ కాన్సెప్ట్‌ స్కూల్‌లో, ఇంటర్‌ శ్రీ చైతన్య జూనియర్‌ కళాశాలలో పూర్తిచేశాక జేఈఈలో 88వ ర్యాంకు సాధించి ముంబై ఐఐటీలో ఇంజనీరింగ్‌ పూర్తి చేశాడు. ఆ తర్వాత తొమ్మిది నెలల పాటు రూ.32 లక్షల వార్షిక వేతనంతో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేసినా సివిల్స్‌ సాధించాలనే లక్ష్యంతో ఉద్యోగం మానేశాడు.

Raavula Jayasimha Reddy Success Story: ఐఏఎస్ సాధించిన రావుల జయసింహారెడ్డి.. హనుమకొండ యువకుడి విజయగాథ!

సొంతంగానే సిద్ధం..

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం మానేశాక చరణ్‌తేజ ఎలాంటి శిక్షణ తీసుకోకుండానే ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న వనరుల ద్వారా సివిల్స్‌కు సిద్ధమయ్యాడు. 2022లో తొలిసారి పరీక్ష రాసినా ప్రిలిమ్స్‌కు అర్హత సాధించకపోగా 2023లో ఇంటర్వ్యూ దశకు చేరాడు. ఇక మూడో ప్రయత్నంలో ఈసారి ఆలిండియా 231వ ర్యాంక్‌ సాధించాడు.

Civils 2024 Ranker Sandeep : సివిల్స్ 2024 ఫ‌లితాల్లో ఉన్న‌త ర్యాంకు.. రెండో ప్ర‌య‌త్నం కూడా.. ఇదే ల‌క్ష్యంగా..

ఆయన తల్లిదండ్రులు 25 ఏళ్ల క్రితమే హైదరాబాద్‌లో స్థిరపడగా తండ్రి హరినాథ్‌బాబు ప్రైవేట్‌ కంపెనీలో మెకానికల్‌ ఇంజనీర్‌గా, తల్లి నాగమణి మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. చరణ్‌ సోదరుడు జైశిక్‌ అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా ఉన్నారు. ఈ సందర్భంగా చరణ్‌తేజతో ‘సాక్షి’ మాట్లాడగా సివిల్స్‌లో ఆప్షనల్‌గా గణితం ఎంచుకున్నట్లు వెల్లడించాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే సివిల్స్‌ సాధించానని, ఐఎఫ్‌ఎస్‌ ఎంచుకోవాలనే భావనతో ఉన్నట్లు తెలిపాడు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 23 Apr 2025 05:07PM

Photo Stories