Skip to main content

Civils 29th Ranker Success Story : నాన్న కోరిక‌, ప్రోత్సాహం.. సివిల్స్‌లో 29వ ర్యాంకు.. నా ప్ర‌యాణం ఇలా..

సివిల్స్ ఫ‌లితాలు విడుద‌ల కాగా, చాలామంది అభ్య‌ర్థులు త‌మ స‌త్తా చాటి, ఉన్న‌త ర్యాంకులు సాధించారు. కొంద‌రు ఒక ప్ర‌య‌త్నంలో అయితే, మ‌రి కొంద‌రు ప‌లు ప్ర‌య‌త్నాల్లో సాధించ‌డం విశేషం. ఇందులోని ఒక ర్యాంకర్ త‌న ప్ర‌యాణం, ప్రోత్సాహం, ఎగుదిగులు వంటి ప‌లు విష‌యాల‌ను పంచుకున్నారు. వారి ప్ర‌యాణం గురించి తెలుసుకుందాం..
Trainee collector and civils 29th ranker saloni chhabra

సాక్షి ఎడ్యుకేష‌న్‌: 'నన్ను కలెక్టర్‌గా చూడాలనేది మా నాన్న కోరిక.. ఈ క‌ల‌ను ఎలాగైనా నెరవేర్చాలని నేను పాఠశాలలో చ‌దివే రోజుల్లోనే నిర్ణ‌యించుకున్నాను. నాకు మా నాన్న అందించిన ప్రోత్సాహంతో ముందుకు సాగాను. ఈ ప్ర‌యాణంలో రెండుసార్లు విఫలమయ్యాను, కాని ఎప్పుడూ నిరాశ ప‌డ‌లేదు. రాత్రింబవళ్లు మరింత కష్టపడి చదివాను. గ‌తంలో చేసిన త‌ప్పుల‌ను తెలుసుకున్నాను. లోటుపాట్లు సవరించుకుని ముందడుగు వేశాను. మూడో ప్రయత్నం చేశాను. ఈసారి ప్ర‌తీ విష‌యాన్ని స‌రిగ్గా అర్థం చేసుకుని, ప్ర‌తీ అడుగు జాగ్ర‌త్తగా వేశాను, చివ‌రికి విజయం సాధించాను.

2023లో విడుద‌లైన‌ యూపీఎస్సీ ఫలితాల్లో నాకు, జాతీయ స్థాయిలో 29వ ర్యాంకు వ‌చ్చింది. ఈ ర్యాంకుతో ఐఏఎస్‌గా తెలంగాణ క్యాడర్‌కు ఎంపికయ్యాను.

UPSC Civils Topper Shakti Dubey ప‌డ్డ కష్టాలు ఇవే..|ఆమె స‌క్సెస్‌కు కారణం.. ?| ఇలాంటి Family నుంచి..

దీంతో, మా నాన్న చాలా సంతోషంగా ఉన్నారు. ఆయ‌న కలను నెరవేర్చడం నాకెంతో ఆనందాన్నిచ్చింది. ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలను అమలు చేసి, పేదలకు సేవ చేయడమే నా లక్ష్యం. అని అంటున్నారు జిల్లాకు నూతనంగా ఎంపికైన‌ ట్రెయినీ కలెక్టర్‌ సలోని చాబ్రా. 'సాక్షి'కి మంగళవారం.. ఏప్రిల్ 29వ తేదీన ఆమె ఇచ్చిన ప్ర‌త్యేక ఇంటర్వ్యూలో, త‌న ప్ర‌యాణం, ప్రిప‌రేష‌న్ విధానం, ప‌రీక్ష వివ‌రాలు, వంటి పలు విషమాలు పంచుకున్నారు.-కైలాస్‌నగర్‌

సాక్షి: 'గుడ్‌ మార్నింగ్‌ మేడమ్‌.. వెల్‌కమ్‌ టు ఆదిలాబాద్‌. ట్రెయినీ కలెక్టర్‌గా జిల్లాకు విచ్చేసిన మీకు మరోసారి ప్రత్యేక అభినందనలు. మీ కుటుంబ నేపథ్యం వివరాలు..

ట్రెయినీ కలెక్టర్‌: మాది హర్యానా రాష్ట్రంలోని గురుగ్రాం. నాన్న ఇంద్రజిత్, అమ్మ సీమ. ఇద్దరూ గురుగ్రాంలోనే బిజినెస్‌ చేస్తుంటారు. అన్న గ్రాడ్యూయేషన్‌ పూర్తి చేశాడు. ఊరిలోనే అమ్మనాన్నలకు తోడుగా ఉంటూ వ్యాపారం చూసుకుంటారు.

UPSC Civils 2024 Topper : UPSC Civils 2024లో మెరిసిన తెలుగు తేజాలు వీరే...

సాక్షి: మీ విద్యాభ్యాసం ఎక్కడెక్కడ సాగింది..

ట్రెయినీ కలెక్టర్‌: ఒకటి నుంచి ఇంటర్మీడియెట్‌ వరకు గురుగ్రాంలోని బ్లూ బెల్స్‌లో చదివాను. చిన్నతనం నుంచే చదువులో ముందుండేదాన్ని. స్కూల్‌లో నిర్వహించే డిబేట్‌లు, ఎక్స్‌ట్రా కరిక్యూలమ్‌లో పాల్గొంటూ ప్రతిభ కనబర్చుతుండేది. చదువులో ఎప్పుడూ ముందుండే నేను టెన్త్, ఇంటర్‌లో ఫస్ట్‌క్లాస్‌ లో పాసయ్యాను. త‌ర్వాత ఢిల్లీలోని శ్రీరాం కాలేజ్‌ ఆఫ్‌ కామర్స్‌ యూనివర్సిటీలో బీఏ ఆనర్స్‌ ఎకానామిక్స్‌ పూర్తి చేశాను. ఆ వెంటనే సివిల్స్‌ పరీక్షలపై దృష్టి పెట్టాను.

సాక్షి: యూపీఎస్సీ కోచింగ్‌ ఎక్కడ తీసుకున్నారు.. ఎన్నోసారి విజయం సాధించారు..?

ట్రెయినీ కలెక్టర్‌: పదో తరగతిలో ఉన్న‌ప్పుడే ఐఏఎస్‌ సాధించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నాను. ఆ దిశగా అడుగులు వేశాను. ఢిల్లీలోని కోచింగ్‌ సెంటర్‌లో ఏడాది పాటు శిక్షణ పొందాను. ఆప్షనల్‌ సబ్జెక్ట్‌గా సోషియాలజీని ఎంచుకున్నా. ప్రణాళికాబద్ధంగా చదివా. 2021లో తొలిసారి యూపీఎస్సీ పరీక్షలకు హాజరయ్యా. ఇంటర్వ్యూ వరకు వెళ్లాను. అయితే కొద్దిపాటి తేడాతో విజయం సాధించలేకపోయాను.

Civils 830 ranker Bhargava Piduguralla success story: కమర్షియల్‌ ట్యాక్స్‌ ఏసీ నుంచి...ఆల్‌ ఇండియా స్థాయిలో 830 ర్యాంక్‌ సాధించిన భార్గవ పిడుగురాళ్ల

మరో ప్రయత్నంలో ప్రిలిమ్స్‌లోనే ఆగిపోయాను. అయినా నిరాశ చెందలేదు. మూడో ప్రయత్నం 2023లో జాతీయస్థాయిలో 29వ ర్యాంకు సాధించాను. ఐఏఎస్‌ కావాలనే నా సంకల్పంతోపాటు నాన్న కలను నెరవేర్చాను. తెలంగాణ క్యాడర్‌కు ఎంపికై ప్రస్తుతం ట్రైనింగ్‌ నిమిత్తం ఆదిలా బాద్‌కు రావడం జరిగింది. ఏడాది పాటు జిల్లాలో పని చేయాల్సి ఉంటుంది. రెండుసార్లు విఫలమైన సమయంలో నేను ఆత్మవిశ్వాసం కోల్పోకుండా అమ్మనాన్నలు అండగా నిలిచారు. వెన్నుతట్టారు. వారందించిన ప్రోత్సాహం తోనే విజయం సాధించాను.

సాక్షి: సివిల్స్, ఇతర పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే యువతకు మీరిచ్చే సలహా..

Sandeep Success Story: సివిల్స్‌ ర్యాంక్‌తో అదరగొట్టిన ఆదిలాబాద్‌ యువకుడు సందీప్‌

ట్రెయినీ కలెక్టర్‌: సివిల్‌ సర్వీసెస్‌కు సన్నద్ధమయ్యే అభ్యర్థుల్లో చాలా మంది ఒకటి, రెండు ప్రయత్నాలకే నిరాశకు లోనవుతారు. ఇక మా వల్ల కాదంటూ వెనుకడుగు వేస్తుంటారు. అపజయాలను చూసి నిరాశ చెందొద్దు. సంకల్పం వీడకుండా ముందుడుగు వేయాలి. పట్టుదలతో ప్రణాళికాబద్ధంగా చదివితే తప్పకుండా విజయం సాధించవచ్చు. రోజుకు కనీసం 8 నుంచి 10 గంటలు చదవాలి. ముఖ్యంగా సెల్‌ఫోన్, సోషల్‌ మీడియాకు దూరంగా ఉండాలి. ప్రతిరోజు పత్రికలను చదవడం అలవాటు చేసుకోవాలి. వర్తమాన అంశాలపై పట్టు సాధించాలి. గత ప్రశ్నాపత్రాలను విశ్లేషించుకోవాలి. సందేహాలుంటే ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకోవాలి. ఆత్మవిశ్వాసం, సంకల్పబలంతో ప్రయత్నిస్తే తప్పకుండా లక్ష్యాన్ని సాధించవచ్చు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 30 Apr 2025 12:35PM

Photo Stories