Raavula Jayasimha Reddy Success Story: ఐఏఎస్ సాధించిన రావుల జయసింహారెడ్డి.. హనుమకొండ యువకుడి విజయగాథ!

గతంలో ఐపీఎస్ ఎంపిక, ఇప్పుడు ఐఏఎస్ విజయం
జయసింహారెడ్డి ఇప్పటికే గతంలో రెండు సార్లు UPSC మెయిన్స్, ఇంటర్వ్యూలకు అర్హత సాధించగా, నాలుగో ప్రయత్నంలో 104వ ర్యాంకుతో ఐపీఎస్ ఎంపికయ్యారు. ప్రస్తుతం నేషనల్ పోలీస్ అకాడమీ, హైదరాబాద్లో శిక్షణ పొందుతూనే ఐదో ప్రయత్నం చేశారు. ఈసారి ఐఏఎస్ సాధించడం ఆయన పట్టుదల, కృషికి నిదర్శనం.
విద్యా ప్రస్థానం
- పాఠశాల విద్య: 7వ తరగతి వరకు జగిత్యాలలో, 8 నుంచి 10 వరకు హనుమకొండ ఎస్ఆర్ ఎడ్యుకేషన్ స్కూల్లో పూర్తి చేశారు.
- ఇంటర్మీడియట్: హైదరాబాద్లోని ప్రైవేట్ కాలేజీలో చదివారు.
- ఇంజనీరింగ్: ఐఐటీ హైదరాబాద్ నుండి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్లో బీటెక్ పూర్తిచేశారు.
- UPSC ప్రిపరేషన్: 2020లో సివిల్ సర్వీసెస్ కోసం సిద్ధమయ్యారు.
చదవండి: Civils Topper Sai Shivani: నెలలో డబుల్ బొనాంజా - గ్రూప్ 1, సివిల్స్లో సత్తా చాటిన సాయి శివాని!
కుటుంబ నేపథ్యం
జయసింహారెడ్డి తండ్రి రావుల ఉమారెడ్డి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో సహ పరిశోధన సంచాలకుడిగా పనిచేస్తున్నారు. తల్లి రావుల లక్ష్మి గృహిణి. జయసింహారెడ్డి చిన్నవారు కాగా, అతని అన్న మనీష్ చంద్రారెడ్డి కాలిఫోర్నియాలో ఉన్న ఆపిల్ కంపెనీలో ఉద్యోగంగా ఉన్నారు.
తల్లిదండ్రుల హర్షం
తమ కుమారుడు ఐఏఎస్ సాధించినందుకు తల్లిదండ్రులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. “జయసింహా చిన్నప్పటి నుంచే దృష్టి సారించిన లక్ష్యాన్ని పట్టుదలతో సాధించాడు,” అని వారు గర్వంగా చెప్పారు.
![]() ![]() |
![]() ![]() |
Tags
- Raavula Jayasimha Reddy IAS
- UPSC 2024 Topper from Telangana
- Hanumakonda IAS Topper
- IAS Success Story 2024
- IAS Rank 46 UPSC 2024
- UPSC Civil Services 2024 Results
- Telugu IAS topper 2024
- Fifth attempt IAS success
- IPS to IAS journey
- Telangana boy clears IAS exam
- UPSC preparation success story
- IIT Hyderabad IAS topper
- IAS training at NPA Hyderabad