Skip to main content

మే 17న ఏపీ ఎడ్‌సెట్ ఫలితాలు విడుదల

యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి): ఆంధ్రప్రదేశ్‌లోని బీఈడీ కళాశాలల్లో ప్రవేశానికి మే 6వ తేదీన నిర్వహించిన ఏపీ ఎడ్‌సెట్-2019 ఫలితాలు మే 17న విడుదల కానున్నాయి.
ఏపీఎడ్‌సెట్‌ను ఈ ఏడాది ఎస్వీ యూనివర్సిటీ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ప్రవేశ పరీక్షను రాష్ట్ర వ్యాప్తంగా 11,650 మంది రాశారు. పరీక్ష ఫలితాలను మే 17 ఉదయం 11.30 గం.కు విజయవాడలోని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ విజయరాజు విడుదల చేస్తారని ఎడ్‌సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ టి.కుమారస్వామి తెలిపారు. ఈ ఫలితాలను www.sakshieducation.com వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
Published date : 16 May 2019 03:08PM

Photo Stories