గ్రూప్1 మెయిన్స్ పరీక్ష కేంద్రాల ఆప్షన్ల నమోదుకు 31వరకు గడువు
Sakshi Education
సాక్షి, అమరావతి: గ్రూప్1-2018 నోటిఫికేషన్కు సంబంధించి మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థులు తమ పరీక్ష కేంద్రాల ఎంపికపై ఆప్షన్ల నమోదుకు ఏపీపీఎస్సీ మరో అవకాశం కల్పించింది.

అభ్యర్థులు ఆగస్టు 31 లోపు ప్రాధాన్యతా క్రమంలో 3 పరీక్ష కేంద్రాలకు ఆప్షన్లు ఇవ్వవచ్చని కమిషన్ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు సోమవారం పేర్కొన్నారు. విశాఖ, రాజమండ్రి, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, హైదరాబాద్ల్లోని కేంద్రాల్లో మెయిన్స్ పరీక్షను నవంబర్ 2 నుంచి 13 వరకు నిర్వహించనున్నారు. ఈ కేంద్రాల్లో మూడింటికి ఆప్షన్లను ఇవ్వవచ్చు. సదుపాయాల అందుబాటును అనుసరించి కేంద్రాలను కేటాయించే అధికారం కమిషన్దేనని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది.
Published date : 18 Aug 2020 01:20PM