Skip to main content

గ్రూప్-2 ప్రాథమిక ‘కీ’ నిండా తప్పులే..

సాక్షి, గుంటూరు:ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేపట్టే ప్రతి నియామక పరీక్ష గందరగోళానికి గురిచేస్తోందని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా, మే5న 446 గ్రూప్-2 పోస్టులకు ఏపీపీఎస్‌సీ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ‘కీ’ని ఇటీవల ఏపీపీఎస్‌సీ విడుదల చేసింది. ఇదంతా తప్పుల తడకగా ఉందని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్క్రీనింగ్ ప్రాథమిక కీలో 12 తప్పులు దొర్లాయి. మరో ఐదు ప్రామాణిక ప్రశ్నలకు సైతం తప్పుడు సమాధానాలున్నాయని అభ్యర్థులు చెబుతున్నారు. సుమారు 30 ప్రశ్నలకు అనువాదం సరిగా లేక సమాధానాలు పెట్టలేకపోయామని తెలుగు మీడియం అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్రశ్నలకై తే సరైన సమాధానాలు ఆప్షన్లలో లేవని మండిపడుతున్నారు. ‘కీ’పై మే 16వ తేదీలోపు అభ్యంతరాలు తెలపాలని ఏపీపీఎస్‌సీ కోరింది. గతంలోనూ ఇలానే తప్పుల తడకగా కీలను విడుదల చేసి, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించారని గుర్తు చేస్తున్నారు. ఈసారి కూడా అలానే చేస్తే తామంతా రోడ్డున పడాల్సి వస్తుందని నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
Published date : 14 May 2019 02:44PM

Photo Stories