ఏపీపీఎస్సీ గ్రూప్-2కు 2.95 లక్షల దరఖాస్తులు
Sakshi Education
సాక్షి, అమరావతి: గ్రూప్-2 పోస్టుల భర్తీకి మే 5 న నిర్వహించనున్న స్క్రీనింగ్ టెస్ట్కు 2,95,036 మంది అభ్యర్థుల దరఖాస్తు చేసుకున్నారని ఏపీపీఎస్సీచైర్మన్ పి. ఉదయ్ భాస్కర్ తెలిపారు.

పరీక్ష నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 727 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొత్తం 447 పోస్టుల భర్తీకి ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఏప్రిల్ 30న మీడియాకు తెలిపారు. హాల్టికెట్తో పాటు, ఒరిజినల్ ఫొటో ఐడెంటిటీ కార్డు కూడా అభ్యర్థులు తీసుకురావాలని, అలాగే నిర్ణీత సమయానికి ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. నెగెటివ్ మార్కుల విధానం ఉంటుంది కనుక అభ్యర్థులు సరైన సమాధానాలు గుర్తించాల్సి ఉంటుందన్నారు.
Published date : 01 May 2019 05:35PM