డిపార్టుమెంటల్ పరీక్షలకు నోటిఫికేషన్ విడుదల
Sakshi Education
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన డిపార్టుమెంటల్ పరీక్ష మే- 2019 నోటిఫికేషన్ను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మే 3న విడుదల చేసింది.

మే 6 నుంచి 21వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మే 20వ తేదీలోగా ఫీజు చెల్లించాలని ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లో పేర్కొంది. కాగా, ఈ డిపార్టుమెంటల్ పరీక్షలు జూన్ 13 నుంచి జూన్ 18వ తేదీ వరకు జరగనున్నాయి.
Published date : 04 May 2019 04:40PM