Skip to main content

Group I: గూప్‌–1పై ముగిసిన వాదనలు

గ్రూప్‌–1 ప్రధాన పరీక్ష డిజిటల్‌ మూల్యాంకనంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో దాఖలైన వ్యాజ్యాలపై వాదనలు ముగిశాయి. 
Group I
గూప్‌–1పై ముగిసిన వాదనలు

న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. గ్రూప్‌– 1 ప్రధాన పరీక్ష సమాధాన పత్రాలను డిజి టల్‌ పద్ధతిలో మూల్యాంకనం చేసే బాధ్యతలను థర్డ్‌పార్టీకి అప్పగించడంపై పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. గ్రూప్‌–1 ఇంటర్యూలతో సహా తదుపరి చర్యలన్నింటినీ నిలిపేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. వీటిపై విచారణ జరిపిన సింగిల్‌ జడ్జి ఇంటర్వూ్యలతో సహా తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి తాజాగా తుది విచారణ జరిపారు.

చదవండి:

APPSC: Study Material

APPSC: Syllabus

Published date : 15 Sep 2021 01:21PM

Photo Stories