Skip to main content

Good News: గెస్ట్ ఫ్యాకల్టీకి తీపి కబురు

ఏపీలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో 8 ఏళ్లుగా పని చేస్తున్న Guest Factuallyకి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది.
  Renewal of AP Contract Faculty working in Govt junior college
గెస్ట్ ఫ్యాకల్టీకి తీపి కబురు

1074 మంది గెస్ట్‌ ఫ్యాకల్టీలకు 2022–23 సంవత్సరానికి 10 నెలలతో కూడిన రెన్యువల్‌ ఇచ్చింది. ఈమేరకు ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ జీవో నంబరు 147 విడుదల చేసింది. వీరికి గత టీడీపీ ప్రభుత్వం నుంచి ప్రతి విద్యా సంవత్సరంలో కేవలం 3 నుంచి 5 నెలలకు గంటల ప్రాతిపదికన పీరియడ్‌కు రూ.150 చొప్పున ఇచ్చేవారు. నెలకు గరిష్టంగా రూ.10,000 మాత్రమే ఇచ్చేవారు. అదీ.. కళాశాల ఎక్యుములేషన్‌ ఫండ్‌ ఆధారంగా వేతనం చెల్లించేలా ప్రొసీడింగ్స్‌ ఇచ్చేవారు. ఎక్యుములేషన్‌ ఫండ్‌ లేని కారణంతో 2017–18, 2018–19, 2019–2020 సంవత్సరాలకు మూడేళ్ల పాటు 87 కళాశాలల్లో లెక్చరర్లు వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వీరి కష్టాలకు చెక్‌ పెడుతూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రెన్యువల్‌ కాలాన్ని పెంచడంతోపాటు ఎక్యుములేషన్‌ ఫండ్‌తో సంబంధం లేకుండా వేతనాలనూ విడుదల చేసింది. 

చదవండి: 

Guest Faculty Posts: హైదరాబాద్‌ సెంట్రల్‌ వర్శిటీలో గెస్ట్‌ ఫ్యాకల్టీ పోస్టులు.. ఎవరు అర్హులంటే

Guest Faculty: డిగ్రీ కాలేజీల్లో గెస్ట్‌ ఫ్యాకల్టీకి అనుమతి

Published date : 09 Sep 2022 01:22PM

Photo Stories