Skip to main content

AP Intermediate Exams 2025: ప్రారంభమైన ఇంటర్‌ పరీక్షలు..

సాక్షి, అమరావతి: ఇంటర్ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. శనివారం ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభం కావడంతో గంట ముందుగానే 8 గంటలకు విద్యార్దులు పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్దులను 8.30 గంటల నుంచి పరీక్ష హాల్ లోకి అనుమతించారు.
AP Intermediate Exams 2025
AP Intermediate Exams 2025

విద్యార్దులను క్షుణ్ణంగా పరిశీలించి, ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు లోపలికి అనుమతించలేదు. విద్యార్దులను తనిఖే చేసి లోపలికి అనుమతించారు. మొదటి పరీక్ష కావడంతో విద్యార్థులతో పాటు తల్లితండ్రులు వారి వెంట వచ్చారు. 

TG YIPS Admissions 2025 : టీజీ వైఐపీఎస్ 2025 నోటిఫికేష‌న్.. అడ్మిష‌న్ వివ‌రాలివే..

ఈ విద్యా సంవత్సరంలో 10,58,893 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. వీరిలో మొదటి సంవత్సరం జనరల్‌ విద్యార్థులు 5,00,963 మంది, ఒకేషనల్‌కు 44,581 మంది ఉన్నారు.

ఏపీ ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల | AP Inter Exam Schedule Released |  Sakshi

రెండో ఏడాది విద్యార్థులు జనరల్‌ 4,71,021 మంది, ఒకేషనల్‌కు 42,328 మంది ఉన్నారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అనేక చర్యలు తీసుకున్నట్లు పరీక్షల విభాగం కంట్రోలర్‌ (సీవోఈ) సుబ్బారావు తెలిపారు. 

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

 

Published date : 01 Mar 2025 11:26AM

Photo Stories