టెన్త్ విద్యార్థులకు వాట్సప్ ద్వారా...మోడల్ పేపర్లు
Sakshi Education
సాక్షి, అమరావతి:ప్రస్తుతం టెన్త పరీక్షలు రాయాల్సిన విద్యార్థులకు దూరదర్శన్ ద్వారా పాఠ్యాంశాలు బోధిస్తున్న సంగతి తెలిసిందే.

ఇందుకోసం పాఠశాలల్లో విద్యార్థులను వాట్సప్ గ్రూపులుగా ఏర్పాటుచేశారు. ప్రతి సబ్జెక్టు టీచర్ ఈ గ్రూపులో ఉంటారు.
- గతంలోని పబ్లిక్ పరీక్షల మోడల్ పేపర్లను ఈ వాట్సప్ గ్రూపుల్లో పంపిస్తున్నారు.
- మరుసటి రోజు దూరదర్శన్లో ఆ మోడల్ పేపర్లలోని ప్రశ్నలను నిపుణులతో చెప్పించడంతోపాటు ప్రశ్నలను అర్థంచేసుకొని సమాధానాలు ఎలా రాయాలో నేర్పిస్తున్నారు.
- దూరదర్శన్ ఉదయం సెషన్లో ప్రశ్నలు చెప్పడంతో పాటు వాటికి పిల్లలతో హోమ్వర్కు చేయించడానికి కొన్ని అంశాలను ఇస్తారు.
- మధ్యాహ్నం రెండో సెషన్లో ఉదయం మోడల్ పేపర్లో ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు ఎలా రాశారు. తప్పులు ఎక్కడ ఉన్నాయి. వాటిని ఎలా సరిచేసుకోవాలో రివ్యూ చేయిస్తారు.
- టీచర్లకు తల్లిదండ్రులకు కూడా ఈ కార్యక్రమం వల్ల కొంత బాధ్యత పెరుగుతుంది. ఎస్సీఈఆర్టీ నుంచి వచ్చే మోడల్ పేపర్ను ఆ సబ్జెక్టు చూసే టీచర్ వాట్సప్ గ్రూపులోని పిల్లలకు పంపిస్తారు.
Published date : 13 May 2020 03:32PM