Skip to main content

నేడు తెలంగాణ టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదల !

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను జూన్ 8వ తేదీ నుంచి నిర్వహించేం దుకు హైకోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ అనుమతి కోసం విద్యాశాఖ ఎదురుచూస్తోంది.
మే 22 (శుక్రవారం)న మంత్రి సబితా ఇంద్రారెడ్డితో చర్చించి షెడ్యూల్ జారీ చేయాలని భావిస్తోంది. ఒకవేళ శుక్రవారం సాధ్యం కాకపోతే శనివారం విడుదల చేసే అవకాశం ఉంది. కరోనా నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో థర్మల్ స్క్రీనింగ్, కేంద్రాల్లో తలుపులు, కిటికీలు, బెంచీలు, కుర్చీలను ప్రతి పరీక్షకు ముందు, తరువాత శానిటైజ్ చేసేలా విద్యాశాఖ ఆదే శాలు జారీ చేసింది. మరోవైపు పరీక్ష కేంద్రాల వద్ద భౌతికదూరం పాటించేలా ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా పరీక్ష కేంద్రాలను రెట్టింపు చేసింది. ప్రస్తుతమున్న 2,500కుపైగా కేంద్రాలకు సమీపంలోని భవనాల్లో కేంద్రాలను ఏర్పాటు చేసింది. కొన్ని చోట్ల అదే పాఠ శాలల్లో సర్దుబాటు చేయగా మరికొన్ని పాఠశాలకు సమీపంలోని భవనాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసింది. అయితే ఆ భవనాల వివరాలతో విద్యార్థులకు కొత్త హాల్‌టికెట్లు జారీ చేయడం లేదు. పాత హాల్‌టికెట్లతోనే విద్యార్థులు పరీక్షలకు హాజరుకావాల్సి ఉంటుంది.
Published date : 22 May 2020 02:38PM

Photo Stories