జూలై 10 నుంచి పదో తరగతి పరీక్షలు...ఈసారి 11 పేపర్లకు బదులుగా 6 పేపర్లే

పెరగనున్న పరీక్ష కేంద్రాలు..
- టెన్త్ పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు జరుగుతాయి. ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2 కాంపోజిట్ కోర్సు ఉ.9.30 నుంచి 11.15 వరకు, ఎస్సెస్సీ ఒకేషనల్, థియరీ పరీక్షలు ఉ.9.30 నుంచి 11.30 వరకు జరుగుతాయి.
- రాష్ట్రవ్యాప్తంగా 11,835 స్కూళ్లకు సంబంధించిన రెగ్యులర్ విద్యార్థులు 6,30,804 మంది పరీక్షలకు హాజరు కానున్నారు. ఒకసారి ఫెయిలై మళ్లీ పరీక్ష రాస్తున్న ప్రైవేట్ విద్యార్థులు 7,800 మంది ఉన్నారు.
- గతంలో 2,923 పరీక్ష కేంద్రాలను కేటాయించినా కరోనా దృష్ట్యా వీటి సంఖ్య పెరుగుతుందని ఎస్సెస్సీ బోర్డు వర్గాలు పేర్కొన్నాయి.
గతంలో ప్రకటించిన పరీక్ష కేంద్రాలు జిల్లాలవారీగా..
జిల్లా | స్కూళ్లు | రెగ్యులర్ విద్యార్థులు | ప్రైవేట్ విద్యార్థులు |
శ్రీకాకుళం | 684 | 38,282 | 448 |
విజయనగరం | 535 | 30,144 | 135 |
విశాఖపట్నం | 1,026 | 56,867 | 615 |
తూ.గోదావరి | 1,167 | 67,917 | 35 |
ప.గోదావరి | 886 | 49,036 | 971 |
కృష్ణా | 1,005 | 56,749 | 857 |
గుంటూరు | 1,040 | 60,045 | 90 |
ప్రకాశం | 830 | 41,551 | 33 |
నెల్లూరు | 758 | 34,949 | 3,370 |
చిత్తూరు | 1,139 | 53,521 | 82 |
కడప | 839 | 37,690 | 288 |
అనంతపురం | 992 | 51,828 | 126 |
కర్నూలు | 934 | 52,225 | 750 |
మొత్తం | 11,835 | 6,30,804 | 7,800 |
టెన్త్ పరీక్షల షెడ్యూల్ ఇలా...
తేదీ | సబ్జెక్టు | మార్కులు |
జూలై 10 | ఫస్ట్ లాంగ్వేజ్ (గ్రూప్-ఏ) | 100 |
జూలై 10 | ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-1కాంపోజిట్కోర్స్ | 70 |
జూలై 11 | సెకండ్ లాంగ్వేజ్ | 100 |
జూలై 12 | థర్డ్ లాంగ్వేజ్ ఇంగిష్ | 100 |
జూలై 13 | మేథమెటిక్స్ | 100 |
జూలై 14 | జనరల్ సైన్సు(ఫిజికల్, బయాలజీ) | 100 |
జూలై 15 | సోషల్ స్టడీస్ | 100 |
జూలై 16 | ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2 కాంపోజిట్కోర్సు | 30 |
జూలై16 | ఓ-ఎస్సెస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్1 | 100 |
జూలై17 | ఓ-ఎస్సెస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్2 | 100 |
జూలై 17 | ఎస్సెస్సీ ఒకేషనల్ | 40 |
జూలై17 | ఎస్సెస్సీ ఒకేషనల్ థియరీ | 30 |
పదో తరగతి మోడల్ పేపర్స్, ప్రీవియస్ పేపర్స్, సిలబస్, టెక్ట్స్బుక్స్, గెడైన్స్ కోసం ఈ లింక్ను క్లిక్ చేయండి