AP SSC Supplementary Exam 2025 News:పదో తగరతి విద్యార్ధులకు బ్రేకింగ్ న్యూస్ .....సప్లిమెంటరీ ఎగ్జామ్స్ తేదీలు వచ్చేశాయ్

ఆంధ్రప్రదేశ్ లో మే నెలలో పదో తరగతి విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఫెయిలైన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలకు ఇవాళ్టి నుంచి ఈ నెల 30 వరకు ఫీజు చెల్లించవచ్చు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్కు మే 1 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రీకౌంటింగ్కు ఫీజు ఒక్కో సబ్జెక్టుకు రూ.500, రీ వెరిఫికేషన్కు రూ.1,000గా ఉంది. https://www.bse.ap.gov.in/ సైట్లో HM లాగిన్ ద్వారా ఫీజు చెల్లించవచ్చు. సప్లిమెంటరీ పరీక్షలు మే 19 నుంచి 28వ తేదీ వరకు జరుగుతాయి.
పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయినవారికి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. పదో తరగతి పరీక్షలలో ఫెయిలయిన విద్యార్థులు బాధ పడొద్దని, ఆందోళన చెందవద్దని సూచించారు.
ఇదీ చదవండి: ఏపీ పదో తరగతి 2025 ఫలితాల్లో చరిత్రలోనే తొలిసారిగా 600కు 600 మార్కులు సాధించి నేహాంజని
కంపార్ట్మెంట్ పరీక్ష 2025 కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి విద్యార్థులు అనుసరించగల స్టెప్లు ఈ కింది విధంగా ఉన్నాయి:
స్టెప్ 1: బోర్డు అధికారిక వెబ్సైట్ https://www.bse.ap.gov.in/ కి వెళ్లండి.
స్టెప్ 2: హోంపేజీలో క్రిందికి స్క్రోల్ చేసి దిగువన ఉన్న 'స్టూడెంట్స్ సర్వీస్' పై క్లిక్ చేయండి.
స్టెప్ 3: 'AP 10th/SSC సప్లిమెంటరీ రిజిస్ట్రేషన్ ఫార్మ్ 2025' లింక్ కోసం వెదికి దానిపై క్లిక్ చేయండి.
స్టెప్ 4: 'AP 10వ/SSC సప్లిమెంటరీ రిజిస్ట్రేషన్ ఫార్మ్ 2025' ను విద్యార్థులు PDF ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకోవాలి.
స్టెప్ 5: విద్యార్థులు పాఠశాల అధికారుల పర్యవేక్షణలో కంపార్ట్మెంట్ రిజిస్ట్రేషన్ ఫారమ్ను పూర్తి చేయాలి.
స్టెప్ 6: భవిష్యత్ ఉపయోగం కోసం ఫార్మ్ ప్రింటవుట్ తీసుకోండి.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- 10th class supplementary exam dates 2025
- SSC supply exam schedule
- 10th standard supply exams
- breaking news for 10th students
- SSC supplementary time table
- 10th board exam updates
- SSC supplementary exams 2025
- 10th failed students supply exams
- 10th class exam news today
- Breaking news
- Education News
- Telugu News