Skip to main content

AP 10th Students Results : ఈ పాఠ‌శాల‌లో నాలుగోసారి 100 శాతం ఉత్తీర్ణ‌త‌..

APJ Abdul Kalam Memorial Municipal School achieves 100 percent score in ap 10th

సాక్షి ఎడ్యుకేష‌న్‌: ఏపీ టెన్త్ ఫ‌లితాలు ఏప్రిల్ 23వ తేదీన విడుద‌లైయ్యాయి. ల‌క్ష‌ల మంది విద్యార్థులు ఉత్తీర్ణుల‌య్యారు. ఉత్త‌మ ర్యాంకులు సాధించారు. ఇక‌, కర్నూలులోని ఏపీజే అబ్దుల్ కలాం స్మారక మున్సిపల్ స్కూల్ మ‌రోసారి స‌త్తా చాటింది. విడుద‌లైన టెన్త్ ఫలితాల్లో వరుసగా నాలుగోసారి 100 శాతం ఉత్తీర్ణత సాధించింది ఈ పాఠ‌శాల. విద్యార్థులంతా ఈ ప‌రీక్ష‌ల్లో ఉత్త‌మ మార్కుల‌తో ఉత్తీర్ణ‌త సాధించి, పాఠ‌శాల పేరును నిల‌బెట్టారు.

AP SSC Supplementary Exam 2025 News:పదో తగరతి విద్యార్ధులకు బ్రేకింగ్ న్యూస్‌ .....సప్లిమెంటరీ ఎగ్జామ్స్ తేదీలు వచ్చేశాయ్

ఇక‌, ఈ ప‌రీక్ష‌లో పాఠ‌శాల నుంచి మొత్తం 43 మంది విద్యార్థులు పరీక్ష రాయగా ఒక్క‌రికి త‌ప్పితే, 42 మంది విద్యార్థుల‌కూ 500కు పైగా మార్కులు వ‌చ్చాయి. ఇక‌, ఆ ఒక్క విద్యార్థికి మాత్రం 491 వచ్చాయి. అంద‌రి కంటే అధికంగా, సాయి లిఖితకు వ‌చ్చాయి, కేవ‌లం 5 మార్కులు మాత్ర‌మే త‌ప్ప‌గా, మొత్తం 595 మార్కులు వచ్చాయి.

Summer Holidays For Schools And colleges: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. నేటి నుంచి వేసవి సెలవులు

9 మంది విద్యార్థులు కూడా 580-591 మధ్య మార్కులు సాధించారు. ఇక‌, విద్యార్థులంతా క‌ష్ట‌ప‌డి, ఉన్న‌త మార్కులతో గ‌ర్వ‌ప‌డే విధంగా మార్కుల‌ను సాధించార‌ని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, టీచ‌ర్లు అభినంద‌న‌లు తెలుపుతున్నారు. కాగా, ఈ స్కూల్‌ పలుమార్లు ఉత్తమ పాఠశాలగా నిలిచింది.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 24 Apr 2025 03:09PM

Photo Stories