Dasara Bonus For Employees : పండగే.. పండగ ప్రతి ఉద్యోగికి రూ.1.90 లక్షలు దసరా బోనస్...
తాజాగా తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు గుడ్చెప్పింది చెప్పింది. ఒక్కో కార్మికుడికి రూ.1.90 లక్షలు బోనస్ను ప్రభుత్వం ప్రకటించింది. దీంతో సింగరేణి కార్మికులకు సంతోషంగా బోనస్ ప్రకటిస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. 2023-24 ఏడాదిలో సింగరేణికి రూ.4,701 కోట్లు లాభం వచ్చిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
☛➤ Good News For Government Employees : ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్.. వీరికి దసరా కానుకగా...
సింగరేణి లాభాల్లో...
ఇందులో సింగరేణి కార్మికులకు రూ.796 కోట్లు బోనస్గా ప్రకటిస్తున్నట్టు చెప్పారు. సింగరేణి లాభాల్లో 33 శాతం బోనస్గా ప్రకటించడం పట్ల కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది కంటే రూ.20వేలు అదనంగా బోనస్ ప్రకటించామని, సింగరేణి చరిత్రలో తొలిసారిగా ఒప్పంద ఉద్యోగులకూ బోనస్ ఇస్తున్నామని ప్రభుత్వం తెలిపింది.
ఈ ఉద్యోగులకు రూ.5వేల చొప్పున...
ఒప్పంద ఉద్యోగులకు కూడా ఒక్కొక్కరికి రూ.5వేల చొప్పున ఇవ్వాలని నిర్ణయించినట్టు చెప్పారు.
☛➤ Dussehra Holidays 2024 : తెలంగాణలో అక్టోబర్ 2వ తేదీ నుంచి దసరా సెలవులు.. మొత్తం...